ఎప్పుడూ లేని విధంగా ఈసారి సెప్టెంబర్ లో జరగబోతున్న దసరా రేస్ టాపిక్ ఆఫ్ ది వుడ్ గా మారింది. బాలకృష్ణ మహేష్ జూనియర్ లు ఇలా అంతా ఒకేసారి దసరా పండుగను టార్గెట్ చేస్తూ తమ సినిమాల విడుదల పై పట్టుదల పట్టడం ఎవరికీ అర్ధం కాని విషయంగా మారింది. 

వాస్తవానికి సంక్రాంతి పోల్చుకుంటే దసరా చిన్న పండుగ. కోస్తా జిల్లాలలోని పల్లెటూరి ప్రాంతాలలో ఈ పండుగ హడావిడి పెద్దగా కనిపించదు. దీనికి కారణం అక్కడి ప్రజలు అంతా ఈ పండుగ టైంలో పొలం పనులలో బిజీగా ఉంటారు. దీనితో రెండేసి వారాల గ్యాప్ తో ఒక పెద్ద సినిమా విడుదల చేసే అవకాశం ఉంటుంది కాని కేవలం 10 రోజుల వ్యవధిలో మూడు పెద్ద సినిమాలను భరించే శక్తీ తెలుగు ప్రేక్షకులకు లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. 

సినిమా మొదలుపెట్టిన నాటి నుండి పూరీ బాలకృష్ణల మూవీ డేట్ ను దసరాను దృష్టిలో పెట్టుకుని ప్రకటించారు. అయితే ఎప్పుడో వస్తుంది అనుకున్న ‘స్పైడర్’ ను కూడ ఈ దసరా రేస్ కు విడుదల చేయడానికి రెడీ పెట్టడమే కాకుండా ఈసినిమా విడుదల కోసం అప్పుడే మన ఇరు రాష్ట్రాలలోను ధియేటర్లు కూడ బుక్ చేస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. 

అయితే ఇప్పుడు సమస్య అంతా జూనియర్ ‘జై లవ కుశ’ కే వచ్చి పడింది అని అంటున్నారు. వాస్తవానికి ఈసినిమాను సెప్టెంబర్ 1కి విడుదల చేద్దాం అనుకుంటే అది కుదరక పోవడంతో ఈసినిమా కూడ అనుకోని పరిస్థుతులలో దసరా రేస్ లో వచ్చి చేరింది. కనీవినీ ఎరుగని రీతిలో ‘జై లవ కుశ’ మార్కెట్ ఏర్పడిన నేపధ్యంలో ఈసినిమాను అంత భారీ స్థాయి రేట్లలో కొనుక్కుని ‘జై లవ కుశ’ ను బాలయ్య మహేష్ సినిమాల మధ్య విడుదల చేస్తే తమకు ఆ రెట్లు వర్కౌట్ కాడని ఈ మూవీ బయ్యర్లు కళ్యాణ్ రామ్ తో బేరాలు ఆడుతున్నట్లు టాక్. 

దీనితో మార్కెట్ లో క్రేజ్ ఉన్నా అనుకోని సమస్యల మధ్య ‘జై లవ కుశ’ చిక్కుకుంది అని అంటున్నారు. దీనితో దసరా రేస్ కు రావలసి ఉన్న ఈమూడు సినిమాలలో ఏదో ఒక సినిమా దీపావళికి జరగవలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. మరి ఈ త్యాగాన్ని మహేష్ చేస్తాడా ? లేదంటే జూనియర్ చేస్తాడా ? ప్రస్తుతానికి సస్పెన్స్ గా కొనసాగుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: