జనత గ్యారేజ్ సినిమాతో నెమ్మదిగా తన ఫార్మ్ తాను తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ . ఆ మధ్య వరకూ వరస ప్లాపులతో సతమతం అయిన మనోడు జనత గ్యారేజ్ పుణ్యమా అంటూ మహేష్ - పవన్ ల సరసన చేరి తన కెరీర్ ఇంకా చాలా ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. కొత్త సినిమా జై లవ కుశ కి ఒక పక్క షూటింగ్ జరుపుతూ నే మరొక పక్క ప్రమోషన్ ల మీద కూడా దృష్టి పెట్టాడు ఎన్టీఆర్.


సెప్టెంబర్ 21 న థియేటర్ లలోకి వస్తున్నాం అంటూ ప్రకటన కూడా చేసేసాడు./ ఈ సినిమా కి సంబందించిన కొన్ని సీన్ లు అనుకోకుండా బయట లీక్ అవ్వడం విశేషం. ఇంకా షూటింగ్ పూర్తి కూడా కాని సీన్ లలోంచి రఫ్ కట్ లు బయట కనపడుతున్నాయి. ఈ దెబ్బతో ఎన్టీఆర్ చాలా సీరియస్ అయినట్టు సమాచారం.


వెంటనే నిర్మాత కళ్యాణ్ రాం సైబర్ క్రైం ని కలవడం ఆ వ్యక్తులని గుర్తించి అరస్ట్ కూడా చెయ్యడం జరిగింది. ఈ విషయం అంతా కళ్యాణ్ రాం ఓపెన్ గానే ప్రకటించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: