బాలకృష్ణ పూరిజగన్నాథ్ ల మూవీ ప్రాజెక్ట్ ‘పైసా వసూల్‌' టైటిల్‌ వల్ల ఆసినిమా నిర్మాతకు ఎన్నికోట్లు లాభం వస్తుందో అన్న విషయమై ప్రస్తుతానికి  క్లారిటీ లేదు. అయితే ఆసినిమా విడుదల కాకుండానే ఆసినిమా వల్ల పూరిజగన్నాథ్ సన్నిహితురాలు  ఛార్మీకి 4 కోట్లు  లాభం వచ్చింది అంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈరోజు ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. 

దీనితో ఈసినిమా కోసం  ఛార్మీ పడ్డకష్టానికి ఈమూవీ ‘పైసా వసూల్‌’ గా మారిపోయింది అనే గాసిప్పులు ఫిలింనగర్  లో హడావిడి చేస్తున్నాయి.  పూరి కనక్ట్స్‌ సంస్థ ద్వారా ఈ చిత్రానికి కాస్టింగ్‌ బాధ్యతలు చూసుకున్న ఛార్మి అటు నిర్మాణ పరంగా అన్ని పనులు  సవ్యంగా జరిగేట్టు పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. తెలుస్తున్న సమాచారం మేరకు చాలరోజుల పాటు జరిగిన పోర్చుగల్‌ షెడ్యూల్‌ ఛార్మి మేనేజ్‌మెంట్‌ వల్లే చాలా తక్కువ ఖర్చుతో అయిపోయిందని టాక్. 

ఈ సినిమాలో ఛార్మీ నటించకపోయినప్పటికీ ఈసినిమాకి అన్నీ తానై  నడిపించిన ఛార్మికి ఈవిధంగా ఈచిత్రం అన్నివిధాలుగా కలిసి వచ్చింది  అనుకోవాలి. ఈ సినిమాను తీస్తున్న నిర్మాతల దగ్గర పూరి జగన్నాథ్ ఈ మూవీని  35 కొట్లలో పూర్తి చేస్తాను అని మాట ఇచ్చిన నేపధ్యంలో పూరి కనక్ట్స్‌ సంస్థద్వారా  ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు చూస్తున్న విషయాలు ఇప్పటికే తెలిసినవే అయినా ఇంత భారీ తారాగణంతో రూపొందుతున్న ఈమూవీ ప్రాజెక్ట్ లో ఇంత పొదుపును ఛార్మీ ఎక్కడ నుంచి చేసింది  అనే విషయం పూరికే అర్ధం కాని విషయంగా మారింది అని టాక్.    

ఛార్మీ ఇప్పటివరకు తన కెరియర్ లో 50కు పైగా సినిమాలలో నటించినా నటిగా ఏసినిమాకీ కోటి కూడా అందుకొని ఛార్మీకి ‘పైసా వసూల్’ అదృష్టంగా మారిందినుకోవాలి. అయితే అటు పూరి వేగం ఇటు ఛార్మీ పొదుపుల మధ్య అత్యంత వేగంగా రుపొందింపబడ్డ బాలకృష్ణ సినిమా పరిస్థితి ఏమిటి అని బాలకృష్ణ అభిమానులు భయపడుతున్నట్లు టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి: