సినిమా వాళ్ళ మీద గాసిప్ లో ఇష్టం లేని జనాలతో గొడవలూ ఏవీ కొత్త విశేషాలు కావు కానీ. సెలెబ్రిటీ ల మధ్యన జరిగే విషయాల గురించి సామాన్య జనాలలో ఉండే ఆసక్తి ని బేస్ చేసుకుని మీడియా ఆ రచ్చ ఎప్పుడూ సాగిస్తూనే ఉంటుంది. అయితే ఈ కలక్షన్ ల గోల మొదలైన తరవాత , యూ ట్యూబ్ లాంటి చానల్స్ ఓపెన్ చేసి రచ్చ మొదలైన తరవాత ఇంకా ఇంకా గొడవ ఎక్కువ ఐపోయింది. ట్విట్టర్ లాంటి చోట్ల తగుదునమ్మా అంటూ ప్రతీ ఒక్కరూ హీరోలతో, డైరెక్టర్ లతో డైరెక్ట్ గా గొడవకి దిగుతున్నారు.


దువ్వాడ జగన్నాథం సినిమా రికార్డులు ఫేక్ చేస్తున్నారు అంటూ కొందరు కాదు ఒరిజినల్ అంటూ మరి కొందరు ఇంటర్నెట్ లో రచ్చ చేస్తున్నారు ఈ మధ్య . ఇటీవల విడుదలైన ‘దువ్వాడ జగన్నాధమ్’ విషయంలో అయితే హీరో బన్నీ, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజులు ఏకతాటిపైకి వచ్చి సోషల్ మీడియా మీద పడ్డారు.


ఇక్కడ పని లేని క్రిటిక్ లు ఎక్కువ అయిపోయారు అనేది వీరి అసలు గోల పైగా ఫాన్స్ యంటీ ఫాన్స్ ముసుగ్లో సినిమాని చంపేస్తున్నారు అనేది మెయిన్ కంప్లయింట్. దువ్వాడ వార్ లో భాగంగా కొద్ది సేపటి క్రితం నిజాం రికార్డ్ కలక్షన్ ని విడుదల చేసిన హరీష్ శంకర్ నిజాం లో తన సినిమాకి 13 రోజుల్లో ఇరవై కోట్ల రూపాయల షేర్ వచ్చింది అనీ ఇది అబద్ధం అని ఎవరైనా నిరూపిస్త్తే తాను సినిమాలు చెయ్యడమే మానేస్తాను అని చెప్పుకొచ్చాడు హరీష్.


మరింత సమాచారం తెలుసుకోండి: