ఈ మాట అంటుంది ఎవరో కాదు నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.  అదేంటీ ఎన్టీఆర్ పై కుట్ర జరగడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..! అబ్బే సిరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదండీ..ఈ మాటలు ఎన్టీఆర్ నవ్వుకుంటూ అంటున్నాడు.  ఈ రోజు హైదరాబాద్ లో ‘బిగ్ బాస్’ షో కి సంబంధించిన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ..ఎన్టీఆర్ తన కొడుకు అంటే తనకు ఎంతో ఇష్టమని ఇంటికి వస్తే..వాడితోనే పూర్తి కాలక్షేపం అని అయితే ఈ మద్య జరిగిన ఓ సంఘటనతో ఖంగు తిన్నానని అంటున్నాడు.

తాను ప్రతిరోజూ షూటింగ్ కు వెళ్లే ముందు వాడిని దగ్గరకి తీసుకుని "నీకు ఎవరంటే ఇష్టం నాన్నా...అమ్మా? నాన్నా?" అని అడిగితే వాడు టక్కున "నాన్న" అని అసమాధానం చెప్పేవాడని..ఈ మద్య షూటింగ్ లో కాస్త బిజీగా ఉన్నానని..వాడిని కలవడం కాస్త లేట్ అవుతుందని..నేను షూటింగ్ షూటింగ్ నుంచి వచ్చేసరికి వాడు నిద్రపోతున్నాడు...మళ్లీ నేను నిద్రలేచేసరికి స్కూల్ కి వెళ్లిపోతున్నాడు.  
Related image
దీంతో మా మద్య కాస్త గ్యాప్ బాగానే పెరిగిందని..ఈ మద్య వాడు  "నాన్నా" అనుకుంటూ తన దగ్గరకి వచ్చాడని, వాడితో మాట్లాడుతూ.."నాన్నా నీకు ఎవరంటే ఇష్టం అమ్మా? నాన్నా?" అని అడగ్గానే ఎప్పుడూ "నాన్న" అనే వాడు అకస్మాత్తుగా "అమ్మ" అనేశాడని దాంతో నేను షాక్ తిన్నానని అన్నాడు.  
Image result for jr ntr family photos
అయితే నాపై తల్లీకొడుకులు ఏదైనా కుట్ర పన్నారా..వీరిద్దరూ కలిసి పోయారా..అసలు ఏం జరుగుతుందో నేను వెంటనే తెలుసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ సరదాగా వ్యాఖ్యానించడంతో..  అక్కడ ఉన్నవారందరూ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: