సినిమా రంగంలో చిన్న చాన్సు దొరికితే చాలు జీవితం ధన్యమైతుందనే భావనలో చాలా మంది ఉంటారు. అయితే ఒక సారి హీరోయిన్ గా చాన్స్ వస్తే ఇండస్ట్రీలో మంచి పేరు హోదా సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి భార్య ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. అయితే రాధిక గతంలో కన్నడంలో టాప్ హీరోయిన్ గా చెలామణి అయ్యింది..అయితే కుమార స్వామిని చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.
అయితే కుమార స్వామి భార్య అంటే ఏ నిర్మాతగానో, దర్శకురాలిగానో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందని అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మళ్లీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వడంపై కుమార స్వామి ఏలాంటి అభ్యంతరం చెప్పలేదట. గతంలో తాను హీరోయిన్ గా ఉన్న సమయంలో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ తనయుడిగా కుమారస్వామి సినీ నిర్మాతగా అవతారం ఎత్తిన రోజుల్లో రాధికతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకుంది..అయితే అప్పటికే కుమార స్వామి పెళ్ళై పిల్లు కూడా ఉన్నారు.
కుమారస్వామి రాజకీయానికి ఆమె వారసురాలైపోయే ప్రయత్నంలో ఉంది. కుమారస్వామికి మొదటి భార్యతో కలిగిన కుమారుడు ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు కుమారస్వామి రెండో భార్య హీరోయిన్ గా వస్తోంది. అంతే కాదు త్వరలో కుమారస్వామి రాజకీయానికి ఆమె వారసురాలైపోయే ప్రయత్నంలో ఉంది. మొత్తానికి తన రెండో భార్య రాధిక సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుడటం ఇప్పుడు కన్నడ నాట హాట్ టాపికైంది.