తెలుగు బుల్లితెరపై ‘శాంతి నివాసం’ సీరియల్ తో తన ప్రస్థానం మొదలు పెట్టిన రాజమౌళి తర్వాత జూ.ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెం.1 చిత్రంతో దర్శకుడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు.  అప్పటి నుంచి ఇప్పటి వరకు అపజయం అనేది తన ఖాతాలో వేసుకోకుండా సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో నెంబర్ వన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.  ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో ఏకంగా ఐదు సంవత్సరాలు ఏ ఇతర సినిమా జోలికి పోకుండా తన టైమ్ మొత్తం ఆ సినిమాలకే కేటాయించాడు.

Image result for baahubali 2

 తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో ఈ రెండు చిత్రాలు ఏ రేంజ్ లో రికార్డుల మోత మోగించాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  అంతే కాదు బాహుబలి 2 చిత్రంతో భారత దేశంలో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన చిత్రంగా గొప్ప పేరు నమోదు చేసుకుంది.  అయితే ఇప్పుడు రాజమౌళి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే..దీంతో జక్కన్నతో అక్కడి నిర్మాతలు సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారు.  ఇక జక్కన్న మాత్రం ఇప్పుడు తాను ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నానని..బాహుబలి కోసం చాలా సమయం వెచ్చించాల్సి వచ్చిందని ప్రస్తుతం తనకు చాలా రెస్ట్ అవసరం అని అంటున్నారు.

Image result for ntr rajamouli

అంతే కాదు తన తదుపరి చిత్రం మరో భారీ బడ్జెట్ సినిమా అవుతుందా లేదా..మరి అతి హిట్ అవుతుందా లేదా అనేది కాలమే చెబుతుందని అంటున్నారు.  ఇక టైమ్ వచ్చినపుడు తన తదుపరి ప్రాజెక్టు గురించి తప్పకుండా చెబుతానని అంటున్నారు. దానికి గురించి ఇప్పుడే చెప్ప లేని పోని అపోహలకు తావు ఇవ్వదల్చుకోలేదని అంటున్నారు.  ఇక తన తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉండబోతుందని వార్తలు వచ్చిన మాట వాస్తవమే కానీ దాని గురించి అప్పుడే ఏం చెప్పలేనని..ఒకవేళ అలా చెబితే దానిపై అప్పుడే అంచనాలు పెరిగిపోతాయని..అందుకే మౌనంగా ఉంటున్నానని అంటున్నారు.

Image result for rajamouli bollywood

ఇప్పటికే ఓ స్టోరి లైన్ సిద్దమైందని..దానిపై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కసరత్తు చేస్తున్నారని అన్నారు. ఇండస్ట్రీకి వీరిద్దరి కాంబినేషన్ లో ‘స్టూడెంట్ నెం.1’ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: