మెగా హీరో వరుణ్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫిదా. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమ దిల్ రాజు నిర్మాణంలో వస్తుంది. జూలై 21న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఆడియో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. హ్యాపీడేస్ తర్వాత శేఖర్ కమ్ముల కాన్ఫిడెంట్ గా చేస్తున్న సినిమా ఫిదా.


ఈ సినిమా కథ ముందు మహేష్ బాబు కోసం అనుకున్నాడని టాక్. లీడర్ తర్వాత మహేష్ నుండి పిలుపు అందుకున్న శేఖర్ కమ్ముల ఫిదా కథ చెప్పాడట. మహేష్ కథ నచ్చినా సరే తాను చేయడానికి చాలా టైం పట్టేట్టు ఉందని తాను వరుణ్ తేజ్ ను సెలెక్ట్ చేసుకున్నాని అన్నారు. 


ఇక ఆ తర్వాత దిల్ రాజుకి కథ చెప్పడంతో వరుణ్ తేజ్ ను సెట్ చేశారని. ప్రేమం తర్వాత సాయి పల్లవి ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ సినిమాకు సాయి పల్లవి పెద్ద అసెట్ అవుతుంది. దిల్ రాజు 25వ సినిమాగా వచ్చిన డిజె హిట్ అయ్యింది. ఇక 26వ సినిమాగా వస్తున్న ఫిదా అదే హిట్ మేనియా కంటిన్యూ చేస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: