తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సినిమాలంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా పవన్, అల్లు అర్జున్,రాంచరణ్ చిత్రాలంటే అభిమానులు కాస్త ఎక్కువే ఎక్స్ పెట్ చేస్తుంటారు.  మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్ గత సంవత్సరం ‘సరైనోడు’ చిత్రంతో మంచి విజయం సాధించి ఈ సంవత్సరం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంతో గత నెల 23 న అభిమానుల ముందుకు వచ్చాడు.  అయితే ఈ చిత్రంపై మొదటి నుంచి రక రకాల వివాదాలు వస్తూనే ఉన్నాయి.  
Image result for డిజే కలెక్షన్లు
తాజాగా ఇప్పుడు డీజే కలెక్షన్లపై పెద్ద దుమారమే చెలరేగుతుంది. డీజే దువ్వాడ జగన్నాథం సక్సెస్ మాట ఎలా ఉన్నా నాలుగు రోజుల్లోనే నాన్ బాహుబలి సినిమాల్లో నెంబర్ వన్ అంటూ ప్రచారం చేయడం అల్లు అర్జున్ పెద్ద తలనొప్పిగా మారింది.  ఇప్పడు ఇతర హీరోల ఫ్యాన్స్ బన్నీపై సోషల్ మీడియాలో మూకుమ్మడి దాడి చేస్తున్నారు.  ఫేక్ కలెక్షన్లు చూపిస్తూ..సినిమాపై అంచనాలు పెంచుతున్నారని విమర్శిస్తున్నారు.  అంతే కాదు  డిజే ఆఫీస్ పై మెగాభిమానులు దాడి చేయడం సంచలనంగా మారింది.
Image result for డిజే కలెక్షన్లు

చిరంజీవి అభిమానులు దిల్ రాజు ఆఫీసు పై దండెత్తి దువ్వాడ జగన్నాథం సినిమా లెక్కలు చూపించండి అంటూ హుకుం జారీ చేసారు దాంతో వాళ్లకు సర్ది చెప్పి పంపించాడు పాపం దిల్ రాజు.  మరి చిరు ఫ్యాన్స్ కి ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటా అని అనుకుంటున్నారా..! చిరంజీవి పదేళ్ల తర్వాత నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం బాక్స్ లు బద్దలు కొట్టి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.
Image result for khaidi no 150 movie
డీజే యూనిట్ చెబుతున్న దాని ప్రకారం ఖైదీ నెంబర్ 150 రికార్డులు బ్రేక్ చేసినట్లు అవుతుంది..మరి ఇంత తక్కువ టైమ్ లో ఆ రికార్డు ఎలా బ్రేక్ చేశారని కలెక్షన్లు చూపించండీ అంటూ దిల్ రాజు ఆఫీసు కు మెగా ఫ్యాన్స్ వెళ్లినట్లు సమాచారం. బాహుబలి తర్వాత స్థానం చిరు నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రానిదే అని తెలుసుకొని వెళ్లిపోయారు కానీ అల్లు అర్జున్ డౌన్ డౌన్ అని నినాదాలు ఇచ్చారు .



మరింత సమాచారం తెలుసుకోండి: