మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతుంది. పరుచూరి బ్రదర్స్ కథ అందిస్తున్న ఈ సినిమా ఆగష్టు నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.


సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తో పాటుగా నయనతార కూడా ఇందులో హీరోయిన్ గా చేస్తుందని తెలుస్తుంది. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫాం చేశారు చిత్రయూనిట్. చిరు పక్కన మొదటిసారి నయనతార నటించబోతుంది.


150 ఏళ్ల క్రితం జరిగిన కథను సినిమాటిక్ హంగులతో తెలుగు తమిళ హింది భాషల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా తెరకెక్కిస్తున్నారు. ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందించబోయే ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారని తెలుస్తుంది. ఖైది నంబర్ 150తో నిర్మాణ రంగంలోకి దిగిన చరణ్ సెకండ్ సినిమాగా వస్తున్న ఉయ్యాలవాడని కూడా ప్రెస్టిజియస్ గా నిర్మించాలని చూస్తున్నాడు. 


ప్రస్తుతం చరణ్ సుకుమార్ తో రంగస్థలం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే చిరు సినిమాకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాడట. ఆగష్టులో ముహుర్తం పెట్టేసి సెప్టెంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూట్ ప్లాన్ చేశారట. సినిమాలో నటించేందుకు గాను నయన్ కు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: