యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమమ జై లవకుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టించింది. ఇక ఈ సినిమాలో తారక్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నాడు. టీజర్ లో జై గా సర్ ప్రైజ్ ఇచ్చాడు జూనియర్.


ఇక ఈ టీజర్ చూసి పూరి తను రాసుకున్న కథలోని మెయిన్ రోల్ బేస్ తోనే జై పాత్ర డిజైన్ చేశారని తన సన్నిహితుల దగ్గర వాపోయాడట. రెండు రోజులుగా సోషల్ మీడియాలో హడావిడి చేసిన ఈ న్యూస్ సినిమా మీద ఎక్కువ ఇంపాక్ట్ అవకుండా సైలెంట్ గా మ్యాటర్ సెటిల్ చేశాడట ఎన్.టి.ఆర్.


టెంపర్ తర్వాత పూరితో సినిమా చేయాలనుకున్నా సరైన కథ కుదరలేదట. అయితే జై పాత్ర తను చెప్పిన ఐడియానే అంటున్న పూరికి మరో సినిమా అవకాశం ఇచ్చి ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేయమని కోరాడట తారక్. ఆఫర్ నచ్చేయడంతో పూరికి కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది. ఇక జై లవకుశ దర్శకుడు మాత్రం జై పాత్ర తాను అనుకున్నదే అంటూ చెబుతున్నాడు. ఏదైనా సరే జై లవకుశ పూరి, బాబిల మధ్య చిచ్చు పెట్టేలా చేసింది.


రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ 21న దసరా కానుకగా రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: