సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా టీజర్ సంచలనం సృష్టించగా మహేష్ డైలాగ్ తో కూడిన టీజర్ కొద్దిరోజుల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రతి విషయంలో కన్ ఫ్యూజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.


ఇప్పటిదాకా స్పైడర్ రిలీజ్ కు రకరకాల డేట్లు వినపడ్డాయి. ఫైనల్ గా మాత్రం ఒక డేట్ ఫిక్స్ చేయలేదు. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ స్పైడర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారట. అందరు అనుకున్నట్టుగానే దసరా బరిలో మహేష్ స్పైడర్ రాబోతుందట. సెప్టెంబర్ 27న మహేష్ స్పైడర్ రిలీజ్ కాబోతుందని చిత్ర నిర్మాతలు అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు.


మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసే గ్రాఫిక్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. 130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళ మార్కెట్ పై మహేష్ స్పైడర్ తో ఎంటర్ అవుతుండగా అక్కడ కూడా సినిమా గట్టి పోటీ ఇచ్చేలా చూస్తున్నారు.


బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ చేస్తున్న సినిమాగా ఫ్యాన్స్ స్పైడర్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇది సెట్స్ మీద ఉండగానే కొరటాల శివతో భరత్ అను నేను స్టార్ట్ చేసిన మహేష్ ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: