మొన్నటి వరకు ఓ లేక్క..ఈ రోజు నుంచి మరో లెక్క..ఇది సినిమా డైలాగ్.. అయితే తెలుగు ఇండస్ట్రీలో దర్శకుధీరుడు రాజమౌళికి ఈ డైలాగ్ సరిగా సరిపోతుంది. ఎందుకంటే బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో తర్వాత జక్కన్న రేంజ్ అమాంతం పెరిగిపోయింది.  ఇప్పుడు జాతీయ స్థాయిలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.  రాజమౌళి కోసం ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ దర్శక, నిర్మాతలు సైతం క్యూ కట్టారు. అయితే తన తదుపరి ప్రాజెక్టు ఏంటీ అన్న విషయం మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు జక్కన.

ప్రస్తుతం తాను రెస్టు తీసుకోవాలని ఐదు సంవత్సరాలు బాహుబలి ప్రాజెక్టు కోసం వెచ్చించానని తాను కొంత కాలం విరామం తీసుకుంటున్నాని చెబుతున్నారు. అయితే రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టు టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు, రాంచరణ్ తో ఉండబోతున్నట్లు ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి.  తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతుంది.
Image result for mahesh ntr ram charan
రాజమౌళి బాహుబలి తర్వాత మరో భారీ సినిమాకు శ్రీకారం చుడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి . అయితే ఈసారి ఒక్క హీరో కాకుండా ముగ్గురు హీరోలతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం జాతీయ స్థాయిలో తనకు పేరు వచ్చింది కనుక మూడు భాషల హీరోలు తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు  ఇలా ముగ్గురు హీరోలతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
Image result for baahubali 2
రాజమౌళి మూడు భాషల్లో ఇప్పుడు మంచి పట్టున్న వ్యక్తి కనుక సినిమాపై భారీ అంచనాలే పెరితిపోతాయి..మరి ఈ ముగ్గురు హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు అని అనుకుంటున్నారు. మరి మిగతా ఇద్దరు ఎవరా అన్నది సస్పెన్స్..అయితే ఈ విషయాన్నీ జక్కన్న అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: