తెలుగు ఇండస్ట్రీలో రారాజుగా వెలిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి. శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన దాదాపు పది సంవత్సరాల తర్వాత ముఖానికి రంగు వేసుకున్నాడు. మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో తన తనయుడు రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో తమిళ సూపర్ హిట్ చిత్రం ‘కత్తి’ రిమేక్ గా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీసిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకు చిరంజీవిపై రక రకాల రూమర్లు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం రిలీజ్ తర్వాత అందరి అంచనాలు తలకిందులు చేశాడు.
నిజంగా చిరంజీవి పది సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో..ఇప్పుడూ అలాగే ఉన్నారని..బాస్ ఈజ్ బ్యాక్ అంటూ బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం చిరంజీవి 151 వ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' నటిస్తున్నారు. స్వాతంత్ర పోరాటం సమయంలో ఓ మహాయోధుడి వీర గాథ ఆదారంగా రూపొందుతున్న చిత్రం ఇది. ఈ సినిమాకి అవసరమైన లుక్ పై చిరూ దృష్టి పెట్టారు.
కథ .. కథనాలు .. నటీనటుల ఎంపిక పనుల్లో దర్శకుడు సురేందర్ రెడ్డి బిజీగా వున్నాడు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో రూపొందే ఈ సినిమాలో, కథానాయికలుగా ఐశ్వర్య రాయ్ .. నయనతారల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఉయ్యాల వాడలో ఓ కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను తీసుకోనున్నారనేది తాజా సమాచారం.
ఆల్రెడీ ఆయనని సంప్రదించడం .. పాత్ర గురించి వివరించడం జరిగిపోయిందని అంటున్నారు. ఇప్పటకే మెగా అల్లుడు అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి'లో ఉపేంద్ర మంచి పవర్ ఫుల్ రోల్ చేసి మెప్పించాడు. ఇక 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' సినిమాలో ఆయన రోల్ ఎలా ఉంటుందో చూడాలి.