తెలుగు ఇండస్ట్రీలోకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ‘పదహారేళ్ళవయసు’ చిత్రంతో హీరోయిన్ గా మారి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది అతిలోక సుందరి శ్రీదేవి. అలనాటి అగ్రహీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణలతో నటించిన శ్రీదేవి తర్వాత తరం నాగార్జున, వెంకటేష్ లతో కూడా నటించింది. తెలుగు లో మంచి పొజీషన్లో ఉన్న సమయంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి అక్కడి స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకుంది. వీరికి జాన్వి కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శ్రీదేవి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా ‘మామ్’ చిత్రంతో మంచి విజయం సాధించింది. ఇండస్ట్రీలో గత కొంత కాలంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కరణ్ జోహార్ నిర్మాణంలో జాన్విని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తుందట.
కట్ చేస్తే శ్రీదేవి తనయ జాన్వి వెండితెర ఆరంగేట్రం కోసం ముక్కుకి సర్జరీ జరిపించుకుందని, అందుకే తన అందంలో పలు మార్పులు వచ్చాయని కొందరు గాసిప్ రాయుళ్ళు పుకార్లు పుట్టించారు. దీనిపై స్పందించిన శ్రీదేవి తన ఇలాంటి వార్తలు రాయడం వల్ల తన కూతురు కెరీర్ కి ఇబ్బందులు రావొచ్చని ఇంకా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ కాకముందే ఇలాంటి రూమర్లు పుట్టించడం న్యాయం కాదని అంటుంది.
తన కూతురు ఇంకా చిన్నపిల్ల, ఆమె విషయంలో ఇలాంటి పుకార్లు పుట్టిస్తే చాలా డిప్రెస్ అవుతుందని, దయ చేసి ఇక మీదట అలాంటి రూమర్స్ జాన్వీపై రాయోద్దని కోరింది. తాను ఎంత పెద్ద హీరోయిన్ అయినా బిడ్డకు తల్లే కదా..! అందుకే తన కూతురు కెరీర్ కోసం ఎంతో ఆరాట పడుతుంది శ్రీదేవి.