నారా రోహిత్ , ఆది , సందీప్ కిషన్ . సుదీర్ బాబు మెయిన్ క్యారెక్టర్ లలో చేసిన శమంతకమణి చిత్రం నిన్న థియేటర్ లలో విడుదల అయ్యింది. విడుదల అయిన మొదటి రోజునే సూపర్ టాక్ తో ఈ చిత్రం దూసుకుని వెళుతోంది. నలుగురు యువ కథానాయకులు మధ్యలో రాజేంద్ర ప్రసాద్ మెయిన్ ఐటెం గా కారు ఉండడం తో యువత ఈ సినిమా కి విడుదల ముందర నుంచే ఫుల్ గా ఎగబడ్డారు.


అయితే ఈ సినిమా కి టాక్ పాజిటివ్ గా రావడం తో సెకండ్ షో టైం కి ఫామిలీ లు సైతం ఈ సినిమాకి ఎగబడ్డారు. విడుదల అయిన అన్ని ప్రాంతాలలో కూడా ఈ చిత్రం సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. డైరెక్టర్ శ్రీరాం ఆదిత్య ఇలా నలుగురు కుర్ర హీరోలని స్టార్ హీరోలని పెట్టుకుని కూడా బాగా హ్యాండిల్ చేసాడు అంటూ ప్రసంసలు వినపడుతున్నాయి.


నలుగురికి నాలుగు విభిన్నమైన పాత్రలనిచ్చి .. ఆ పాత్రలకి సమానమైన ప్రాధాన్యతనిచ్చి కథా కథనాలను ఆసక్తిగా నడిపించిన తీరును ప్రశంసిస్తున్నారు. 'భలే మంచి రోజు' తరువాత 'శమంతకమణి'తో శ్రీరామ్ ఆదిత్య ఆడియన్స్ ను మెప్పించడంతో, తదుపరి సినిమాల కోసం కొంతమంది నిర్మాతలు ఆయనను సంప్రదిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: