యూట్యూబ్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న చాందిని చౌదరి వెండితెర మీద మాత్రం సైడ్ హీరోయిన్ అయ్యింది. అదేంటి అంటారా యూట్యూబ్ లో హీరోయిన్ అంటే ఈమేరా అనిపించుకున్న చాందిని ఆ క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ మీద అవకాశాలు తెచ్చుకుంది కాని వాటిని మాత్రం సరిగా వాడుకోవట్లేదు. యూట్యూబ్ క్వీన్ అక్కడ తేలిపోతుంది.


యువ హీరో రాజ్ తరుణ్ తో షార్ట్ ఫిలింస్ లో నటించి మెప్పించిన చాందిని 'మధురం' అనే షార్ట్ కం టెలి ఫిల్మ్ లో అదరగొట్టేసింది. ఫణి డైరెక్ట్ చేసిన ఈ చిన్న సినిమాతో చాందిని బాగా పాపులర్ అయ్యింది. ఇక దాని తర్వాత కేటుగాడు సినిమా అవకాశాన్ని అందుకుంది చాందిని. ఆ సినిమా ఫ్లాప్ అవగా ఆ తర్వాత కుందనపు బొమ్మలో కూడా అమ్మడు హీరోయిన్ గా చేసింది.  


ఆ సినిమా వచ్చింది పోయింది కూడా ఎవరికి తెలియదు. యూట్యూబ్ లో తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకున్న చాందిని సిల్వర్ స్క్రీన్ పై మాత్రం అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా కాదు సినిమాలో ఓ చిన్న రోల్స్ కు మాత్రం పనికొచ్చేట్టు కనబడుతుంది చాందిని. మహేష్ లాంటి స్టార్ హీరో సినిమా బ్రహ్మోత్సవంలో వచ్చింది కథా సంతోషం సాంగ్ లో అలా మెరుపులా కనిపించిన చాందిని రీసెంట్ గా వచ్చిన శమంతకమణిలో ఆది పక్కన పెయిర్ గా నటించింది.


ఆ సినిమాలో హీరోయిన్ కు అసలు ఇంపార్టెంట్ లేదు. చెప్పాలంటే నలుగురు హీరోలున్నా హీరోయిన్స్ మాత్రం ఎవరు లేరని చెప్పాలి. కథ కథనాల మీద ఫోకస్ పెట్టిన దర్శకుడు శ్రీరాం ఆదిత్య ఆ నలుగురికి హీరోయిన్స్ మాత్రం సెట్ చేయలేదు. చాందినిని మాత్రం ఆది సాయికుమార్ కు జోడిగా అది కూడా ఏదో రెండు మూడు సీన్స్ లో చూపించేశారు. మరి సినిమాలను సెలెక్ట్ చేసుకోవడం తెలియట్లేదా లేక నిజంగానే ఆమెకు అవకాశాలు రావట్లేదా అన్న డౌట్ వస్తుంది. 


యూట్యూబ్ మొత్తం షేక్ ఆడించిన చాందిని ఇలా కేవలం సైడ్ హీరోయిన్ గా మారడం ఆశ్చర్యంగానే ఉంది. ప్రస్తుతం చాందిని బ్రహ్మానందం తనయుడు గౌతం నటిస్తున్న మనులో హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఆ సినిమా అయినా అమ్మడు ఫేట్ మారుస్తుందేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: