టాలీవుడ్ డ్రగ్ స్కాం లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు.. టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాధ్. పూరితో పాటుగా అతనితో పరిచయం ఉన్న వారంగా ఈ డ్రగ్స్ తో లింక్ పెట్టేశారు. రెండు మూడు రోజులుగా పూరి మీద రకరకాల వార్తలొచ్చాయి. అయితే వీటికి రీసెంట్ గా తాను ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నా అని ట్వీట్ చేశాడు. కాని రూమర్ మాత్రం ఆగలేదు. మరింతగా న్యూస్ లో బకరా అయ్యాడు పూరి.


అందుకే పూరి కూతురు పవిత్ర ఈ విషయంపై ఘాటుగా స్పందించింది.. ఓ కుటుంబం కలిగిన వ్యక్తిపై ఇలాంటి వార్తలు రాయడం సరికాదు.. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా మీమీద ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.. నాన్న ఓ సెలబ్రిటీ ఇష్టమొచ్చినట్టుగా రూమర్స్ రాయడం సరి కాదని చెడామడా వాయించేసింది పూరి తనయ పవిత్ర.


తన తండ్రి గురించి ఎవరో ఏదో రాస్తే అదే నిజమవుతుందా.. తానెప్పుడు కొన్ని లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటి కోసమే తపన పడతాడని అంటుంది పవిత్ర. తండ్రి మీద తనకున్న ప్రేమకు అందరు భలే అంటున్నారు. అయితే ఈ విషయం ప్రస్తావించేంత వయసు అనుభవం తనకు లేకున్నా సరే తండ్రి మీద వచ్చిన రూమర్స్ ను తట్టుకోలేక పూరి కూతురు పై కామెంట్స్ చేసి నాన్నకు ప్రేమతో అంటూ జనాలను ఆకట్టుకుంది.


పవిత్రి చెప్పిన దానిలో కూడా నిజం లేకపోలేదు. సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తి కాబట్టి మంచి ఎలా ఉంటుందో చెడు అలానే ఉంటుంది. అయితే ఈ విషయంపై తనకు ఎలాంటి సంబంధం లేదు అని పూరినే ఓ పది నిమిషాలు టైం తీసుకుని క్లారిటీ ఇస్తే సరి. దీనికి ఎందుకు తాను బిజీగా ఉన్నా అని డొంకతిరుగుడుగా మాట్లాడటం అని అంటున్నారు. మరి మీడియా ప్రశ్నలకు పూరి ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: