కొరటాల శివ - త్రివిక్రమ్ , రాజమౌళి తరవాత ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఈయన. మిర్చి సినిమా నుంచీ మొన్నటి జనత గ్యారేజ్ వరకూ ఒక్కటంటే ఒక్క ప్లాప్ కూడా చవి చూడని కొరటాల శివ ప్రస్తుతం మహేష్ తో భరత్ అనే నేను చిత్రం తీస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్  తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.


 ఇదివరకే బండ్ల గణేష్ తో కొరటాల ఇదే కాంబినేషన్ లో సినిమా చేయాల్సి ఉంది కానీ అది ఎందుకో పట్టాలు ఎక్కలేదు. ఇన్నాళ్ళకి కుదిరిన ఈ కాంబినేషన్ మీద అందరి కళ్ళూ ఉన్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ .. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా, ఈ కాంబినేషన్లో ఓ సినిమా నిర్మితం కానుంది.


ఈ సినిమా కోసం కొరటాల తీసుకుంటున్న పారితోషికం 14 కోట్లని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. హిట్స్ తో పాటే కొరటాలకి డిమాండ్ పెరుగుతూ వచ్చిందనీ, అందుకే ఆయన పారితోషికం ఆ స్థాయిలో ఉందనే టాక్ వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: