తెలుగు ఇండస్ట్రీలో క్రియేటీవ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సుకుమార్.  ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’ లాంటి సెంటిమెంట్ చిత్రంతో అందరి హృదయాలు గెల్చుకున్నారు.  అంతే కాదు హీరోని ఎక్కువగా ఎలివేట్ చేస్తూ.. సుకుమార్ చిత్రాలు కాస్త ప్రయోగాత్మకంగానే ఉంటాయని టాక్.  ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్  చిత్రం ‘రంగస్థలం’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు సుకుమార్.  ఇక ‘ఊపిరి’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో తనకు తానే సాటి అనిపించుకున్నారు వంశిపైడిపల్లి.
Image result for darshakudu audio function
తాజాగా  అశోక్ బండ్రెడ్డి, ఈషా రెబ్బా జంటగా సుకుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘దర్శకుడు’.  ఈ చిత్రం ఆడియో వేడుక సందర్భంగా వంశీ పైడిపల్లి గురించి సుకుమార్ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు.  ఆర్య చిత్రం షూటింగ్ సమయంలో దిల్ రాజు తో తనకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఏర్పాడ్డాయని మద్యలో వంశ ఎంటర్ అయ్యాడని..అప్పటి నుంచి తానంటే ఈర్ష్య పెరిగిపోయిందని అన్నారు.  
Image result for rangasthalam 1985 sukumar ram charan
ఆ మద్య రిలీజ్ అయిన ‘ఊపిరి’ చిత్రం చూసే వరకు అది అలాగే కంటిన్యూ అవుతూ వచ్చిందని..ఆ..ఊర్ష్య అంటే అదేదో పగతో కూడింది కాదండీ బాబూ..ప్రేమతోనే..ఇక ‘ఊపిరి’ చిత్రం చూసిన  వెంటనే ఫోన్ చేసి వంశిని తిట్టేసానని, ఎదవ… ఇలాంటి మంచి సినిమా ఎలా తీసావురా… అంటూ చాలా తిట్లు తిట్టానని, అంత అనుబంధం తమ మధ్య ఉందని’ సరదాగా చెప్పుకొచ్చారు సుకుమార్.
Image result for vamsi pidipally sukumar
ఈ సందర్భంగా వంశి పైడిపల్లి మాట్లాడుతూ..‘రంగస్థలం’ లోని ఓ పాట సుకుమార్ తనకు వినిపించాడని..అంతే తన మైండ్ బ్లోయింగ్ అయ్యిందని ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోగలనని అన్నారు.  వాస్తవానికి ఈ ఇద్దరూ మంచి స్నేహితులని ఇండస్ట్రీ చెప్పుకుంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: