స్టార్ సినిమాలకు డైరక్షన్ చేస్తూ ఆ స్టార్స్ ను అదే రేంజ్ లో వాడేస్తున్నాడంటూ క్రేజీ డైరక్టర్ సుకుమార్ మీద కామెంట్స్ వస్తున్నాయి. దర్శకుడిగా ఉన్న సుకుమార్, సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్లో సినిమాలను నిర్మిస్తున్నాడు. మొదటి సినిమాగా తన కథ కథనాలతో వచ్చిన కుమారి 21ఎఫ్ సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఈ ప్రొడక్షన్ లో వస్తున్న సెకండ్ మూవీ దర్శకుడు. 


తను నిర్మించే సినిమాలను మార్కెట్ చేసుకోవడం కోసం లీడింగ్ స్టార్స్ ను అదేనండి తను డైరెక్ట్ చేసే సినిమాల్లో హీరోలను తెగ వాడేస్తున్నాడు. కుమారి సినిమా టైంలో నాన్నకు ప్రేమతో సినిమా సెట్స్ మీద ఉండగా ఎన్.టి.ఆర్ తో ఆ సినిమా టీజర్ రిలీజ్ చేయించాడు. ఇక అంతేకాదు ఆర్యతో బన్ని క్రేజ్ పెంచాడు కాబట్టి అదే బన్నిని ఆడియో రిలీజ్ కు పిలిపించి సర్ ప్రైజ్ ఇచ్చాడు.


ఇక ఇప్పుడు దర్శకుడు సినిమాకు కూడా అదే క్రమంలో సెట్స్ మీద ఉన్న రాం చరణ్ రంగస్థలం షూట్ కు గ్యాప్ ఇచ్చి ఈ సినిమా ప్రమోషన్స్ కు వాడేస్తున్నాడు. ఆల్రెడీ దర్శకుడు ఆడియోకి చరణ్ రాగా సినిమా రిలీజ్ టైంలో కూడా చరణ్ తో ట్వీట్స్ చేయించే ప్లాన్ లో ఉన్నాడట సుకుమార్. ఓ పక్క ప్రొడక్షన్ మరో పక్క తను తీసే సినిమాలు ఇలా సుకుమార్ వాడకం మాములుగా లేదు.


రంగస్థలం సినిమా చరణ్ స్టామినా తెలియచేసేలా ఉంటుందని అంటున్నారు. ఇక దర్శకుడు సినిమా విషయానికొస్తే అసోక్ హీరోగా చేసిన ఈ సినిమాను హరి ప్రసాద్ డైరెక్ట్ చేశాడు. ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగష్టు 4న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: