టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం జెట్ స్పీడ్ వేగంగా వ‌రుస‌గా సినిమాలు చేసేస్తున్నాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ న‌టిస్తోన్న స్పైడ‌ర్ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 27న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉండ‌గానే మ‌హేష్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అనే నేను సినిమాలో న‌టించేస్తున్నాడు.

Image result for mahesh babu vamsi pidipally

పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల ఇలా ఉండ‌గానే అప్పుడే మ‌హేష్ 25వ సినిమా కూడా సెట్స్ మీద‌కు వెళ్లేందుకు రెడీ అవుతోంది. భ‌ర‌త్ అనే నేను షూటింగ్ డిసెంబ‌ర్‌కు కంప్లీట్ కానుంది. డిసెంబ‌ర్ నుంచి మ‌హేష్ 25 సెట్స్ మీద‌కు వెళుతుంది. ఈ సినిమాకు ముందు నుంచి టాలీవుడ్ అగ్ర నిర్మాత‌లు అశ్వ‌నీద‌త్ - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తార‌ని, వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని అనౌన్స్‌మెంట్ జ‌రిగింది.

Image result for mahesh babu koratala shiva

దీంతో మ‌హేష్ 25 వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలోనే ఉంటుంద‌ని అంద‌రూ ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో చాలా మ‌ర్పులు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కేవ‌లం దిల్ రాజు మాత్ర‌మే నిర్మిస్తార‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమా డైరెక్ట‌ర్‌గా ముందు అనుకున్న వంశీ పైడిప‌ల్లి కాకుండా  శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 

Image result for mahesh babu dil raju

ఇక కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మార్క్‌గా తెర‌కెక్కే ఈ సినిమాకు శ్రీనివాస క‌ళ్యాణం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. రాజు త‌న బ్యాన‌ర్ మీద ఈ టైటిల్ కూడా రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు స‌మాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: