టాలీవుడ్లో గత మూడు దశాబ్దాల క్రితం జోరుగా ఉండే మల్టీస్టారర్ ట్రెండ్ గత నాలుగేళ్ల నుంచి తిరిగి స్టార్ట్ అవుతోంది. అయితే ఈ మల్టీస్టారర్ సినిమాలు అడపాదడపా మాత్రమే వస్తున్నాయి. అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ మహేష్తో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, పవన్తో గోపాల...గోపాల, యంగ్ హీరో రామ్తో మసాలా సినిమాలు చేశారు. ఇక తాజాగా నలుగురు యంగ్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా శమంతకమణి చేశారు. జవాన్లో సాయిధరమ్, సందీప్కిషన్ కలిసి నటిస్తున్నారు.
అయితే ఇప్పుడు వస్తోన్న సినిమాల్లో మీడియం రేంజ్ హీరోలు మాత్రమే కలిసి నటిస్తున్నారు. ఇక ఓ అగ్ర నిర్మాత ఇప్పుడు అదిరిపోయే కాంబోలో ఓ మల్టీస్టారర్కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అగ్ర హీరో నాగార్జున, ఏడు వరుస హిట్లతో ఫుల్ జోరుమీదున్న నేచురల్ స్టార్ నాని కలిసి నటిస్తోన్నట్టు వార్తలు వస్తున్నాయి.
మరో ట్విస్ట్ ఏంటంటే ఈ క్రేజీ కాంబోలో వచ్చే సినిమాకు ఓ యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. పైగా ఆ డైరెక్టర్ ఇప్పటి వరకు యావరేజ్ సినిమాలు మాత్రమే తీస్తాడన్న పేరుంది. అలాంటిది ఆ డైరెక్టర్కు ఈ క్రేజీ ప్రాజెక్టు అప్పగించడంపై ఇండస్ట్రీలో పెద్ద సెన్షేషనల్ టాపిక్ నడుస్తోంది.
ఇక సదరు అగ్రనిర్మాత బ్యానర్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులైంది.
ఇప్పుడు ఆయన నాగ్ - నాని కాంబోలో తీసే సినిమాతో నిర్మాతగా మళ్లీ రిటర్న్ అవుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఆయన ఈ ప్రాజెక్టుకు సెట్ చేసిన డైరెక్టర్ ఈ ప్రాజెక్టును ఎలా డీల్ చేస్తాడా ? అన్న సందేహాలే వ్యక్తమవుతున్నాయి.