సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ తో భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత అసలైతే ఎన్.టి.ఆర్ తో సినిమా అన్నారు కాని అది ఎందుకో వెనక్కి వెళ్లి చరణ్ తో ముహుర్తం పెట్టేశారు. 2018 సమ్మర్ లో స్టార్ట్ అవుతున్న ఈ సినిమాపై ఓ న్యూస్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది.


రచయితగా ఉన్న కొరటాల శివ దర్శకుడిగా మారి తీసిన సినిమా మిర్చి. ప్రభాస్ ను కొత్త కోణంలో చూపించిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యిందు. ఇక ఆ తర్వాత మహేష్ తో శ్రీమంతుడు ఆల్ టైం హిట్ అవగా ఎన్.టి.ఆర్ తో తీసిన జనతా గ్యారేజ్ కూడా అదిరిపోయే హిట్ అందుకుంది. అయితే చరణ్ తో కొరటాల శివ ఇప్పుడు సెట్ అయ్యింది కాని కొరటాల శివ మిర్చి తర్వాతనే చరణ్ కు కథ వినిపించాడట.


ఎందుకో అప్పుడు కొరటాల శివ మీద అంత గురి ఏర్పడని చరణ్ సారీ అనేశాడు. ఇక ఆ తర్వాత మహేష్, ఎన్.టి.ఆర్ లకు హిట్ ఇవ్వడంతో మళ్లీ కొరటాల శివనే లైన్లోకి తెచ్చాడు చరణ్. ఈ కథ ఒకప్పుడు చరణ్ కు చెప్పిందే అంటున్నారు. ఆ కథనే కాస్త మార్చి ఇప్పుడు సినిమా తీస్తున్నారట. సీన్ మేకింగ్.. డైలాగ్ రైటింగ్.. కథనం ఇలా ప్రతి కోణంలో స్టార్ సినిమాకు కొత్త రంగు అద్దిన కొరటాల శివ సినిమా అంటే హిట్ అన్న విధంగా సెంటిమెంట్ ఏర్పడింది.


అందుకే చరణ్ తో సినిమా అంటే స్టార్స్ సైతం రెడీ అంటున్నారు. డివివి దానయ్య నిర్మాణంలో భరత్ అను నేను సినిమా చేస్తుండగా చరణ్ సినిమాను నిరనజన్ రెడ్డి నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం కొరటాల శివ 14 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: