కమల్ హాసన్ లాంటి దిగ్గజ హీరో మాట్లాడినా, ట్వీట్ వేసినా ఏం చేసినా ఏదో ఒక రచ్చ మామూలు అయిపొయింది. ఆయన బిగ్ బాస్ షో దగ్గర నుంచీ ఆయన నడుపుతున్న తన సొంత ట్విట్టర్ ఎకౌంటు వరకూ అన్నీ వివాదం లో , కోర్టు కేసుల్లో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక పెద్ద కవిత నే పోస్ట్ చేసారు.


"ప్రస్తుతం ఎవరూ రాజు కాదు. మనం విమర్శిద్దాం. మనం రాజులం కాము. ఓడినా, మరణించినా, నేను తీవ్రవాదినే. నేను తలచుకుంటే నేనే నాయకుడిని. లొంగి ఉండటానికి నేను బానిసను కాను. కిరీటాన్ని వదిలిపెట్టినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. నాతో పాటు రండి కామ్రేడ్... అసంబద్ధతను బద్దలు గొట్టే నాయకుడిగా తయారు అవుతారు " అంటూ ఆయన కవిత్వం సాగింది. కమల్ ని గురించి మాట్లాడిన తమిళ ఆర్ధిక మంత్రి జయకుమార్ కి వ్యతిరేకంగా కమల్ ఈ మాటలు రాసారు అనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: