టాలీవుడ్లో నందమూరి హీరోలకు, సూపర్స్టార్ మహేష్బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే టోటల్ టాలీవుడ్లో పెద్ద పండగ వాతావరణమే నెలకొంటుంది. అలాంటిది నందమూరి ఫ్యామిలీ హీరోలకు మహేష్కు ఒకేసారి ఫైటింగ్ జరిగితే ఇక బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధ వాతావరణమే నెలకొంటుంది.
ఇక ఒకేసారి మహేష్ ఇద్దరు నందమూరి హీరోలతో పోటీపడితే మామూలు రంజుగా ఉండదు. అలాంటి మజాలాంటి పోరు ఈ దసరాకు జరగనుంది. టాలీవుడ్లో ఈ దసరా సీజన్ అదిరిపోనుంది. ముందుగా ఎన్టీఆర్ జై లవకుశ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్కు రెడీ అవుతోంది. జై లవకుశ రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ చేసుకుంది.
ఇక బాలయ్య - పూరి కాంబోలో తెరకెక్కుతోన్న పైసా వసూల్ సినిమా జెట్ స్పీడ్తో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. ఈ సినిమా కూడా దసరా కానుకగా సెప్టెంబర్ 29న రిలీజ్కు రెడీ అవుతోంది. ఇక ఈ రెండు సినిమాలకు మధ్యలో ప్రిన్స్ మహేష్బాబు సినిమా వస్తోంది. సెప్టెంబర్ 27న మహేష్బాబు - మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న స్పైడర్ సినిమా రిలీజ్ అవుతోంది.
అటు జై లవకుశ, పైసా వసూల్, స్పైడర్ ఈ మూడు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. స్పైడర్ ఏకంగా మూడు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఏదేమైనా మరి ఒకేసారి ఇద్దరు నందమూరి హీరోల మధ్యన వస్తోన్న మహేష్ ఈ పోటీని ఎలా ఎదుర్కొంటాడు ? ఫైనల్గా ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది చూడాలి.