ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ప్రస్థుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి వైసిపి పార్టీకి రాజకీయ సలహా దారుడుగా ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ నియోజక వర్గాలలో రహస్యంగా పర్యటనలు చేస్తూ ప్రస్తుతం ప్రజల నాడిని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని వార్తలు గుప్పు మంటున్నాయి. 

దీనికోసం ఒక ప్రత్యేకమైన టీమ్ ను ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసి వివిధ అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. పనిలో పనిగా రాబోయే ఎన్నికలలో ఏ అభ్యర్ధిని వైసిపి పార్టీ తరపున పోటీలో దింపితే ప్రయోజనం ఉంటుంది అన్న కోణంలో ఇప్పుడు చాల లోతుగా ప్రశాంత్ కిషోర్ టీమ్ అధ్యయనం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థుతుల నేపధ్యంలో ప్రశాంత్ కిషోర్ టీమ్  అనుకోని విధంగా పవన్ కళ్యాణ్ వేడి తగిలింది అన్న వార్తలు గాసిప్పులుగా హడావిడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య ఏపి కి సంబంధించి కొన్ని జిల్లాలలో ఈ టీమ్ అక్కడి ప్రజలతో సంభాషణలు జరుపుతున్నప్పుడు జనం మధ్య పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా చర్చ జరగడం ప్రశాంత్ కిషోర్ టీమ్ కు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

దీనికితోడు ‘జనసేన’ పార్టీ కార్యకలాపాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు ఏమాత్రం చేరువ కాకపోయినా చాల జిల్లాలలోని ప్రజలు ముఖ్యంగా యువకులు పవన్ ‘జనసేన’ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం ప్రశాంత్ కిషోర్ టీమ్ పసిగట్టింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో రాబోతున్న ఎన్నికలలో పవన్ ప్రభావాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని ఒక అభిప్రాయాన్ని ఆ టీమ్ ప్రశాంత్ కిషోర్ దృష్టికి తీసుకు వచ్చినట్లు టాక్. 

ఈవార్తలే నిజం అయితే ఈ విషయం పవన్ అభిమానులకు ఒక శుభవార్త అనుకోవాలి. ప్రస్తుతం పవన్ తన ‘జనసేన’ ను మరిచిపోయి కేవలం సినిమాలలో బిజీగా ఉన్నా జనం మాత్రం పవన్ కోసం ఎదురు చూస్తున్నారు అన్న విషయం పవన్ దృష్టికి చేరితే పవన్ ఆలోచనలలో ఇప్పుడు ఏమైనా స్పీడ్ పెరుగుతుందా అన్న సందేహాలు కొందరి విశ్లేషకుల భావన.. 


మరింత సమాచారం తెలుసుకోండి: