తెలుగు ఇండస్ట్రీలో క్రియేటీవ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు కృష్ణ వంశి.  ఈయన తీసే సినిమాల్లో ఏదో ఒక సందేశం తప్పకుండా ఉంటుందని ఇండస్ట్రీలో తెలిసిన విషయమే.  అయితే గత కొంత కాలంగా కృష్ణవంశికి వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నారు.  దీంతో తన తదుపరి చిత్రం ఇండస్ట్రీ హిట్ సాధించాలనే తపనతో కసితో మల్టీస్టారర్ చిత్రం ‘నక్షత్రం’ తెరకెక్కిస్తున్నారు.  చాలారోజుల పాటు షూటింగ్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈనెల 28న రిలీజ్ కి సిద్ధమైంది.  
Image result for nakshatram movie stills
సందీప్ కిషన్ , సాయి ధరమ్ తేజ్ , రెజీనా , ప్రగ్యా జైస్వాల్ కలిసి నటించిన చిత్రం '' నక్షత్రం ''.  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది.  తాజాగా ఈ చిత్రం నైజాం లో రిలీజ్ చేస్తున్న ఆర్కే మీడియా అధినేత రవికుమార్ పనస నక్షత్రం విజయం పై ధీమాగా ఉన్నాడు.  నక్షత్రంలో అన్ని అంశాలపై చర్చించారని సమాజంలో జరుగుతున్న కుళ్లు రాజకీయాలు ఎలా ఉన్నాయో..డబ్బు కోసం ఏమేమి చేస్తున్నారో స్పష్టంగా తెలియజేశారని అన్నారు.  
Image result for nakshatram movie stills
కరెంట్ ఇష్యూ తో తెరకెక్కిన నక్షత్రం తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని , కృష్ణవంశీ మళ్ళీ ఈ సినిమాతో భారీ విజయం అందుకోవడం ఖాయమని అంటున్నాడు. అంతే కాదు ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపణలు సృష్టించిన డ్రగ్స్ మాఫియా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రిలీజ్ కి సిద్దమైన నక్షత్రం సినిమా కూడా డ్రగ్స్ , మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో తప్పకుండా మంచి మైలేజ్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు ఆ చిత్ర బృందం.
Related image
 ఇక పాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ఇప్పటికే సాంగ్స్ మంచి హిట్ టాక్ వచ్చాయని సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అంటున్నారి చిత్ర బృందం.


మరింత సమాచారం తెలుసుకోండి: