తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొత్త సినిమాల హవా బాగ పెరిగిపోయింది. గతంలో పెద్ద నోట్ల చలామణి రద్దు సమయంలో చాలా సినిమాలు వాయిదాలు పడ్డ విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా సినిమాలు రిలీజ్ కాకపోవడంతో వచ్చిన పెద్ద సినిమాలకు ఎలాంటి పోటీ లేకుండా పోయింది. ఈ మద్య చిన్ని సినిమాల జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలంగా ఊరిస్తూ వస్తున్న చిత్రాలు గోపిచంద్ ‘గౌతమ్ నంద’, కృష్ణవంశి దర్శకత్వంలో వస్తున్న ‘నక్షత్రం’.
మొత్తానికి ఈ సినిమాలకు మోక్షం వచ్చింది..ఈ నెల 28 న భారీ అంచనాల మద్య ఈ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక తమిళ డబ్బింగ్ సినిమాలు కూడ సందిట్లో సడేమియా అంటూ వస్తున్నాయి. ఈనెల 28న గౌతమ్ నంద , వి ఐ పి 2 , నక్షత్రం మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. గోపీచంద్ హీరోగా నటించిన గౌతమ్ నంద పై ఆ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
గత కొంత కాలంగా అపజయాలు ఎదుర్కొంటున్న గోపి చంద్ కి ఈ సినిమా విజయం ఎంతో అవసరం. అంతే కాదు ఇండస్ట్రీలో క్రియేటీవ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశి కూడా మూడు సంవత్సరాల నుంచి అపజయాలు ఎదుర్కొంటున్నారు..అందుకే ‘నక్షత్రం’ విజయం ఆయనకు చాలా అవసరం. ఇక తమిళ హీరో ధనుష్ గతంలో రఘువరన్ బిటెక్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంతో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ నటించడం మరో విశేషం. ఇక సోషల్ మీడియాలో ఈ మూడు చిత్రాలకు సంబంధించిన ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూడు చిత్రాల్లో ఏది హిట్ అవుతుందో..ఏది ఫ్లాప్ అవుతుందో వేచి చూడాల్సిందే.