హైదరాబాద్లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు విచారణ చేపట్టారు. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది ప్రముఖుల్లో ఈ రోజు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సిట్ ఎదుట హాజరయ్యారు. సిట్ ఇన్ చార్జ్ శ్రీనివాస్ నేతృత్వంలో విచారణ జరిగింది. సిట్ విచారణ లో పాల్గొన్న సిన్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్, కెల్విన్ ని అరెస్ట్ చేసిన అధికారి.
విచారణ గదిలో ఓ మానసిక వైద్యుడు..పూరి సమాధానాలు ఇచ్చే తీరును గమనిస్తున్న ఓ డాక్టరు ఉన్నారు. విచారణను పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, అకున్ సబర్వాల్. విచారణ గదిలో పూరితో పాటు నలుగురు హాజరు. విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్ కు సిట్ అధికారులు చుక్కలు చూపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
డగ్స్ మాఫియాతో సంబంధాలు, పర్సనల్ లైఫ్, సినిమా లైఫ్ గురించి అధికారులు ఆరాతీసినట్లు తెలుస్తోంది. తొలత సిట్ అధికారుల ప్రశ్నలకు తటాపటాయించి సమాధానాలు చెప్పిన పూరీ కెల్విన్ ఎవరో తెలియదనీ చెప్పే ప్రయత్నాలు చేశారట. కాని అధికారులు ఉక్కిరిబిక్కిరి చేయడంతో చివరకు కెల్విన్ తెలుసునని ఒప్పుకున్నాడని తెలుస్తోంది. తాను 17 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చానని..తనకు సినిమానే ప్రపంచమని, సినిమాల కోసమే తన బృందంతో పాటు బ్యాంకాక్ వెళ్తుంటానని చెప్పినట్టు సమాచారం.
పబ్స్, విదేశాలకు వెళ్లడం తన హాబీ అని, తనకు బయటి స్నేహితులు ఉన్నట్లు తెలిపారని సమాచారం. ఓ ఈవెంట్ సందర్భంగా పబ్లో కెల్విన్ను కలిసిన విషయం నిజమేనని ఒప్పుకున్న పూరీ... ఆ తర్వాత తనకు, కెల్విన్కు మధ్య రెగ్యులర్గా ఎలాంటి సంభాషణలు జరగలేదని చెప్పినట్టు సమాచారం. తనకు డ్రగ్స్ వాడే అలవాటు లేదని టాలీవుడ్ దర్శకుడు చెప్పినట్టు తెలుస్తోంది.