యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న సినిమా జై లవకుశ. సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్న తారక్ మొదటిగా రివీల్ చేసిన జై పాత్ర అందరిని ఆకట్టుకుంది. టీజర్ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఎన్.టి.ఆర్ స్టామినా ప్రూవ్ చేస్తూ కోటి వ్యూస్ సొంతం చేసుకుంది. టీజర్ తోనే రికార్డులను సృష్టించిన జై లవకుశ ఆ రికార్డుల పరంపరని కొనసాగిస్తుంది.


లేటెస్ట్ రికార్డ్ ఏంటంటే ఆంధ్రాలో ఈ సినిమా ఏకంగా 36 కోట్ల భారీ బిజినెస్ చేసిందట. ప్రీ రిలీజ్ బిజినెస్ లో తారక్ తన సత్తా చాటుతున్నాడు. కేవలం ఆంధ్రాలో ఈ రేంజ్ బిజినెస్ ఏ సినిమాకు జరుగలేదు. ఇక తెలుగు రెండు రాష్ట్రల్లో జై లవకుశ 70 కిఓట్ల బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో తారక్ సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాడు.    


రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కథ కథనాల్లో కొత్తగా కనిపించడమే కాకుండా ఈ దసరాకు అసలైన మాస్ మసాలా మూవీగా రాబోతుంది జై లవకుశ. ఇక పోటీగా మహేష్ స్పైడర్, బాలయ్య పైసా వసూల్ రిలీజ్ కు సిద్ధమవుతున్నా జై బిజినెస్ ఏమాత్రం తగ్గట్లేదు.


సెప్టెంబర్ 21న రిలీజ్ కన్ఫాం చేసుకున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక జై లవకుశ సెకండ్ టీజర్ ఆగష్టు 1న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. జైతో అదరగొట్టిన తారక్ లవ, కుశల పాత్రలలో ఎలా కనిపిస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: