బిగ్ బాస్ షోలో ప్రస్తుతం ఉన్న 14 మంది కంటెస్టంట్స్ సెలబ్రిటీల కింద లెక్క కట్టడం లేదు ఆడియెన్స్. ఖాళీగా ఉన్న వారిని తెచ్చి రియాలిటీ షో అంటే ఎలా అని కామెంట్లు ఎక్కువగానే వినపడుతున్నాయి. అంతేకాదు షో అంత ఇంట్రెస్ట్ గా నడవట్లేదు అన్నది వినిపిస్తున్న టాక్. అందుకే బిగ్ బాస్ షోకి కొత్త కలర్ వచ్చేలా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హాట్ యాంకర్ అనసూయని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారట.


ఓ పక్క బిగ్ బాస్ హౌ లో హౌజ్ మెట్స్ ముందు ఎవరిని బయటకు పంపాలా అనే ఆలోచనలో ఉండగా అప్పుడు మరొకరిని లోపలికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్ కాస్త పెద్దదిగానే ఉందని తెలుస్తుంది. ఈ లిస్ట్ లో అనసూయతో పాటుగా తేజశ్వి మడివాడా, మంచు లక్ష్మి కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.


వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలా ఉంటుంది.. అసలు ఉంటుందా లేక షోని వీళ్లతోనే లాగించేస్తారా అన్నది చూడాలి. 14 మంది హౌజ్ మెట్స్ లో అంతా సరదాగా సాగుతున్నట్టే కనిపిస్తున్నా హౌజ్ లో కొంతమంది మధ్య వాగ్వివాదాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఏమాత్రం ఛాన్స్ దొరికినా తమకి నచ్చని వారిని ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు.


సోమవారం నుడి శుక్రవారం వరకు బిగ్ బాస్ హౌజ్ మెట్స్ మాత్రమే కనిపిస్తారు.. ఇక శని ఆదివారాల్లో యంగ్ టైగర్ బిగ్ బాస్ షోలో మరిన్ని విశేషాలను చెబుతాడు. మొదటి వారం ఫీడ్ బ్యాక్ ఎలా ఉందో తారక్ రాబోయే రెండు రోజుల్లో ఎపిసోడ్స్ తో తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: