అనేక అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ సూపర్ షో ప్రస్తుతం టీవీ లలో నడుస్తోంది. మా టీవీ లో ప్రతి రోజూ రాత్రి తొమ్మిదిన్నర కి మొదలు అవుతున్న ఈ షో పదిన్నర వరకూ వస్తుంది. సెలెబ్రిటీ లు అందరినీ దదాపు డబ్భై రోజుల పాటు ఒక ఇంట్లో ఉంచి నిర్వహించే ఈ షో లో సరైన మజా రావడం లేదు అని మాటీవీ యాజమాన్యానికి ఫోన్ లు వస్తున్నాయట.


దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంచు లక్ష్మి ని కానీ తేజస్వీ ని కానీ పంపాలి అని చూస్తున్నారు. వీరిద్దరికంటె కూడా యాంకర్ అనసూయ ని పంపడం ఇంకా బెస్ట్ అనేది మా టీవీ వారి ఐడియా . కానీ ఆమె కాల్ షీట్ ల విషయం లో జాప్యం అవుతుందేమో అనుకుంటున్నారు కూడా. అనసూయ చాలా ప్రోగ్రామ్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే.


ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉండిపోతే .. అవన్నీ డిస్టర్బ్ అవుతాయి. మంచు లక్ష్మి ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ ఆఖరి షెడ్యూల్ లో ఉన్నారు అది పూర్తి అవ్వగానే ఆమె ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ వారాంతం లో పంపిస్తారు అని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: