ఝాన్సి లక్ష్మి బాయి కథతో హిందీలో తెరకెక్కుతున్న "మణికర్ణిక, ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ" శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనా రనౌత్ తో హైదరాబాద్లో ఈ సినిమా షూటింగులో భీకరమైన కత్తియుద్ధ దృశ్యాలు చిత్రీకరిస్తుండగా ఆమెకు గాయమై పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంది. షూటింగ్ లో ఆమె నుదురుపై తీవ్రమైన కత్తి గాయం అయి అధిక రక్తస్రావమైంది.
"కంగనను వెంటనే సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించాం. ఆమెను ఐసీసీయూ చేర్చారు. ఆమె నుదురుపై 15 కుట్లు పడ్డాయి. మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. ఇది చాలా తీవ్రమైన కత్తిగాటు అని, దాదాపు ఆమె ఎముక వరకు తెగిందని వైద్యులు తెలిపారు" అని చిత్రయూనిట్ ముంబాయికి చెందిన "మిడ్-డే" పత్రికకు తెలిపింది.
కత్తియుద్ధ దృశ్యాల్లో సహజత్వం కోసం తన డూప్ను వాడటానికి నటి కంగన అంగీకరించలేదని ఈ దృశ్యం కోసం కోసం ఫలు దఫాలుగా రిహార్సల్ చేసినా కూడా షూటింగ్లో ఈ దుర్ఘటన జరిగిందని నిర్మాత కమల్ జైన్ తెలిపారు.
నిహార్, కంగన కత్తియుద్ద దృశ్శ్యం చిత్రీకరిస్తున్న సందర్భములో నిహార్ కత్తి ముందుకు దూసుకురావటం తో కంగన కనుబొమ్మల మధ్య కట్టి తగిలి బలమైన తెగి బలమైన గాయం అయిన్దని, దీంతో 30 నిమిషాల్లోనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లామని నిర్మాత తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో, బాధతో విలవిలలాడుతున్న కంగనను చూసి నిహార్ భయపడిపోయాడని, కానీ కంగన ధైర్యంగా ఏం జరగలేదని అతన్ని సముదాయించిందని వివరించారు.
కాగా, ఈ కత్తిగాయం మచ్చ కంగన ముఖంపై కొనసాగే అవకాశముందని ఆమెకు చికిత్స అందించిన డాక్టర్ తెలిపారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో కంగన కథానాయికగా 'మణికర్ణిక' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.