హైదారబాద్ లో డ్రగ్స్ సృష్టిస్తున్న ప్రకంపణలు అన్నీ ఇన్నీ కావు.  ముఖ్యంగా టాలీవుడ్ ని డ్రగ్స్ మాఫియా షేక్ చేస్తుంది. ఇప్పటికే పలువురు సినీతారలపై, డైరెక్టర్, కెమెరామాన్ ఇలా కొంత మంది పేర్లు సిట్ బయట పెట్టింది. అంతే కాదు ఒక్కొక్కరినీ ఒక్కో తేదిలో తమ క్యారాలయానికి రావాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేసింది.  ఈ మేరకు నిన్న డైరెక్టర్ పూరి జగ్నాథ్ సిట్ ఎదుట హాజరైన విషయం తెలిసిందే.  తాజాగా కెమెరామెన్ శ్యామ్ కె.నాయుడు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.  
Image result for puri jagannadh
తొలుత ఈ రోజు (జూలై 20వ తేదీ) నటి చార్మీని విచారించాల్సి ఉంది. శ్యామ్ కె నాయుడును ఈ నెల 23న విచారించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా శ్యామ్ కె నాయుడును అధికారులు ఈ రోజు పిలిచారు. చార్మీని ఏ తేదీన విచారిస్తారో తెలియాల్సి ఉంది. ఇండస్ట్రీలో శ్యాం కే.నాయుడు దర్శకులు పూరి మంచి స్నేహితులు. అంతే కాదు  డ్రగ్ సప్లయర్ కెల్విన్ మొబైల్‌లో శ్యామ్ కె నాయుడు మొబైల్ నంబర్‌ను సిట్ అధికారులు గుర్తించారు.
Image result for drugs
ముగ్గురు ఈవెంట్ ఆర్గనైజర్ల సెల్ ఫోన్లలో శ్యామ్ కె నాయుడు పేరును అధికారులు గుర్తించారని తెలుస్తోంది. మొదటి నుంచి డ్రగ్స్ కి తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్న శ్యాంకె.నాయుడుకి మరి ఆ ముగ్గురు నెంబర్లు ఎందుకు తన వద్ద ఉంచుకున్నారు..వారు ఏం చేస్తున్నారో తనకు తెలియకుండా ఎలా ఉంటుందనే ప్రశ్నలు సిట్ అడగబోతున్నారని సమాచారం.  
Image result for drugs tollywood
మరోవైపు డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ విచారణకు సహకరించారని సిట్‌ అధికారి శీలం శ్రీనివాస్‌ బుధవారం తెలిపారు. విచారణలో ఆయన కొన్ని క్లూస్‌ ఇచ్చారన్నారు. విచారణలో మరిన్ని ఆధారాలు దొరికాయని చెప్పారు. పూరీ అనుమతితో రక్త నమూనాలు సేకరించామని, శాంపిల్స్ వచ్చిన తర్వాత మాట్లాడుతామని చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: