తెలుగుతెర భారీ రియాలిటీ షోగా అత్యంత భారీ అంచనాలతో ప్రారంభం అయిన ‘బిగ్ బాస్’ షోకు రేటింగ్స్ కు సంబంధించిన అంచనాలు అన్నీ తారుమారు కావడంతో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ‘స్టార్ మా’ ఛానల్ తెగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘బిగ్ బాస్’ హిందీ షోకు తప్పించి మిగతా దక్షిణాది భాషలలో ప్రసారం అవుతున్న ‘బిగ్ బాస్’ కార్యక్రమాలకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. 

తమిళంలో కమలహాసన్ కన్నడంలో ఉపేంద్ర ఈషోను పెద్దగా రక్తి కట్టించలేకపోయారు. ఇప్పుడు అదే బాటలో జూనియర్ ‘బిగ్ బాస్’ కూడా నడుస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థుతులలో ఈషో క్రేజ్ ను పెంచడానికి నిర్వాహకులు మరొక కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘బిగ్ బాస్’ షోకు రేటింగ్స్ పెరగడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉపాయాన్ని ఆలోచిస్తున్నారని టాక్. పేరుకు ఈషోలో 14 మంది సెలెబ్రెటీలు పాల్గొంటున్నా వారెవ్వరికీ సరైన ఇమేజ్ లేకపోవడంతో ఈ షోలో చూడటానికి ఏముంది అని సగటు బుల్లితెర ప్రేక్షకుడు పెదవి విరుస్తున్నట్లు టాక్. 

దీనితో ఈషోకు సంబంధించి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈషో క్రేజ్ పెంచడానికి అనసూయ – రష్మీ – మంచు లక్ష్మి – తేజస్వి లలో ఎవరో ఒక ఇద్దరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ షోలో ప్రవేశపెట్టి ఈషో క్రేజ్ ను పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీరంతా ‘బిగ్ బాస్ పేరు చెపితే ఉలిక్కి పడుతున్నారని సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: