బెల్లంకొండ వారసుడిగా అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ సినిమా అంతగా ఆడలేదు ఆ వెంటనే స్పీడున్నోడు అంటూ వచ్చి అంతే స్పీడుగా థియేటర్ల నుండి వెళ్లిపోయాడు శ్రీనివాస్. తనయుడి కెరియర్ మీద పూరి దృష్టి పెట్టిన బెల్లంకొండ సురేష్ ఈసారి బోయపాటిని రంగంలో దించాడు.


సరైనోడు తర్వాత స్టార్స్ ఆఫర్స్ వచ్చినా సరే కాదని బెల్లంకొండ బాబుతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు బోయపాటి శ్రీను. ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్ కోసం జయ జానకి నాయకా సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాట్ టీజర్ బోయపాటి మార్క్ కు దూరంగా అనిపించింది.


అయితే అన్ని సినిమాల్లా కాకుండా కొత్త కుర్రాడు కాబట్టి అసలు కథ సినిమాలోనే అంటూ ఫిక్స్ అయ్యాడనుకుంట బోయపాటి అందుకే ట్రైలర్ లో ఎలాంటి క్లూస్ వదల్లేదు. బోయపాటి సినిమా అంటే మాస్ ఆడియెన్స్ కు పండుగే మరి అలాంటి మాసిజం లేకుండా ఈ సినిమా వస్తే ఎలా అంటున్నారు ఫ్యాన్స్. అయితే వాటికి ఏమాత్రం డోఖా లేదని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది.


ఓ కుర్ర హీరో స్టార్ డైరక్టర్ తో ఒక సినిమా తీసినంత మాత్రానా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటాడా.. తన సత్తా స్టార్స్ తోనే కాదు.. కుర్ర హీరోలతో కూడా నిరూపించుకుంటా అని బోయపాటి ప్రూవ్ చేసుకుంటాడా అన్నది ఈ సినిమాతో తెలిసిపోతుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా భద్ర సినిమా టైపులో ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: