ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక ఆంధ్రజ్యోతి ఈరోజు పతాక శీర్షికలో నిన్న సినిమాటోగ్రాఫర్ శ్యాం కె. నాయుడు డ్రగ్స్ కేసు విచారిస్తున్న సిట్ అధికారులకు పూరి జగన్నాథ్ అలవాట్లకు సంబంధించి చెప్పిన విషయాలను ప్రచురించి మరో సంచలనానికి తెర తీసింది. పూరికి సంబంధించిన అలవాట్లు అన్నీ తనకు తెలుసు అని అయితే పూరీకి డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో తనకు తెలియదు అని చెప్పినట్లు ఆ పత్రిక కథనం.

పూరి డైరెక్ట్ చేసిన సినిమాలలో దాదాపు 12 సినిమాలకు ఫోటో గ్రాఫర్ గా వ్యవహరించిన శ్యాం కె. నాయుడు పూరి అలవాట్ల పై స్పందిస్తూ తనకు పూరి వ్యక్తిగత అలవాట్ల గురించి తెలిసినా తాను ఆ విషయాల పై ఎప్పుడు శ్రద్ధగా పరిశీలించలేదని అయితే తాను కనీసం సిగరెట్ కూడ అలవాటు లేని నేపధ్యంలో పూరి అలవాట్ల పై కాసేపు పాజిటివ్ గా మరికాసేపు నెగిటివ్ గా చెప్పినట్లు ఆ పత్రిక కథనం. 

అయితే పూరి డబ్బు కోసం ఇటువంటి డ్రగ్స్ వ్యవహారం చేయడని కేవలం స్నేహితులు సన్నిహితులు అన్న అభిమానంతో ఇటువంటి వ్యవహారంలో చిక్కుకుని ఉంటాడని శ్యాం కె. అభిప్రాయ పడినట్లు ఆ పత్రిక కథనం. ఇదే సందర్భంలో ఇతడు తనకు కెల్విన్ ఎవరో తెలియదు అని మరో తెలివైన ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం.

అంతేకాదు ఎక్సైజ్ అధికారులు శ్యాం కె. నాయుడును ప్రశ్నిస్తున్నప్పుడు ఎటువంటి టెన్షన్ తన ముఖంలో కనిపించనీయకుండ చాల నిబ్బరంగా వ్యవహరించినట్లు ఆ పత్రిక వార్తలు వ్రాసింది. ఇదే సందర్భంలో శ్యాం కె. నాయుడు చెప్పిన మాట్లలలో ఒక ప్రముఖ పత్రికాధిపతి ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త పేర్లు కూడ ఉండటంతో ఈ కేసు మరింత గందరగోళంగా మారే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈరోజు పూరికి అత్యంత సన్నిహితుడైన సుబ్బరాజు విచారణకు వస్తున్న నేపధ్యంలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: