ఈమధ్య  కాలంలో అల్లుఅర్జున్ కాలం ఏమాత్రం కలిసి వస్తున్నట్లు కనిపించడంలేదు. ఈమధ్య బన్ని తన లేటెస్ట్ మూవీ ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాను అమెరికాలో ప్రమోట్ చేయాలని అమెరికా వెళ్ళినప్పుడు బన్నీ ప్రవర్తనకు అక్కడ తెలుగు సంఘాల సభ్యులు తమ తీవ్ర అసహనాన్ని వ్యక్తపరిచినట్లు వార్తలు వచ్చాయి. 

ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులచేత తరుచు టార్గెట్ గాబడుతున్న బన్ని ఇప్పడు కమల్ హసన్ అభిమానులచేత కూడ టార్గెట్ కాబడటం కోలీవుడ్ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. ఆశ్చర్యకరమైన ఈ న్యూస్ వివరలాలోకి వెళ్ళితే అల్లుఅరవింద్ అల్లుఅర్జున్ రామ్ చరణ్ సచిన్ టెండూల్కర్ ప్రోమోటర్లుగా ప్రో కబాడీ లీగ్ కు సంబంధించి జరుగుతున్న జాతీయపోటీలలో ‘తమిళ్ తలైవాస్’ టీమ్ ను ప్రమోట్ చేస్తున్నారు.

ఈ టీమ్ కు ప్రముఖ కోలీవుడ్ హీరో కమలహాసన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ టీమ్ ప్రమోషన్ కు సంబంధించిన ఒక భారీ కార్యక్రమం ఈమధ్య చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ రామ్ చరణ్ లతో పాటు కమలహాసన్ కూడ హాజరు అయ్యాడు. 

అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన వేదిక పై రామ్ చరణ్ కమలహాసన్ పక్కన చాల హుందాగా కూర్చుని ఉంటే అల్లు అర్జున్ మాత్రం కాలుమీద కాలు వేసుకుని కమలహాసన్ పక్కన కూర్చుని ఉండటం బన్నీ అహంకారాన్ని సూచిస్తోంది అంటూ కోలీవుడ్ మీడియా కామెంట్స్ వ్రాస్తోంది. సచిన్ టెండూల్కర్ తో పాటు ఎందరో ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మంచి ఇమేజ్ వస్తుందని బన్నీ భావిస్తే అతడు చేసిన చిన్న పొరపాటు వల్ల కమలహాసన్ అభిమానులు కోలీవుడ్ మీడియా నుండి విమర్శలకు గురికావడం బన్నీకి మరొకసారి పొరపాటు అలవాటుగా  మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: