డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కుంటున్న పూరి జగన్నాథ్ ను సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల పై ఇప్పటికే రకరకాల కథనాలు మీడియాలో హడావిడి చేసాయి. అయితే వాస్తవంగా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు ఏమిటి అన్న విషయం పూరి జగన్నాథ్ తన సన్నిహితులకు కూడ లీక్ చేయడం లేదు అని వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు ప్రస్తుతం విచారణ జరుగుతున్న సందర్భంలో తనంతట తానుగా అధికారులు అడిగిన ప్రశ్నలు లీక్ చేయనని పూరి తన సన్నిహితులతో కూడ సున్నితంగా చెపుతున్నట్లు టాక్. సిట్ అధికారులు ‘నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా’ అని అడిగిన మాటను మాత్రం బయట పెడుతూ తనకు తెలిసి ఉండగా తనకు శత్రువులు లేరు అని సమాధానం ఇచ్చిన విషయాన్ని పూరి తన సన్నిహితుల వద్ద లీక్ చేస్తున్నట్లు సమాచారం. 

అయితే తనకు తెలియని శత్రువులు ఎవరైనా తనను టార్గెట్ చేసారేమో అని పూరి సిట్ అధికారుల వద్ద అన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సామాన్యంగా ఒక టాప్ డైరెక్టర్ సినిమాను తీసే సమయంలో కనీసం తాను వేగంగా రెండు సినిమాలను తీస్తానని అటువంటి పరిస్థుతులలో డ్రగ్స్ అలవాటు ఉంటే తాను అంతవేగంగా సినిమాలను ఎక్కడ తీయగలను అని పూరి సిట్ అధికారులకే ఎదురు ప్రశ్నలు వేసినట్లు టాక్. 

ఇది ఇలా ఉండగా పూరి ఇన్ని సమస్యలలో ఉన్నప్పటికీ తన లేటెస్ట్ మూవీ ‘పైసా వసూల్’ మూవీ గురించి తన టీమ్ తో నిరంతర చర్చలు జరపడమే కాకుండా తన భవిష్యత్ సినిమాల గురించి కూడ తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. దీనికితోడు ఎప్పటికైనా ‘జనగణమన’ సినిమా తీయడం తన లైఫ్ ఏంబిషన్ అని చెపుతూ ‘ఐ లవ్ ఇండియా, ఐ హేట్ ఇండియన్స్’ అన్నది దాని ట్యాగ్ లైన్ అని కూడా చెపుతున్నట్లు తెలుస్తోంది.

ఈసినిమాలో డ్రగ్స్ వ్యవహారాలు మాత్రమే కాకుండా అనేక సమస్యలు ప్రస్తావన తీసుకు వస్తూ తనకు దేశం పట్ల ఎంత ప్రేమ మరియు బాధ్యత ఉందో తెలియ చెప్పే విధంగా ఈసినిమా స్క్రిప్ట్ ఉంటుందని పూరి తనను కలిసిన మీడియా వారికి లీకులు ఇస్తున్నట్లు సమాచారం. ఇంతకీ పూరీకే తెలియని శత్రువులు ఎవరూ అన్నది ప్రశ్నార్ధకంగా మారింది ?.. 


మరింత సమాచారం తెలుసుకోండి: