ప్రస్తుతం టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న సెలెబ్రెటీలు ఎవరికి వారు ఈ ఉచ్చు నుండి బయటకు రావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ తమకు ఈ కేసు తో ఎటువంటి సంబంధం లేదు అంటూ పైకి ధైర్యం ప్రదర్శిస్తున్నారు. ఇంతవరకు ఈ వ్యవహారంలో చిక్కుకున్న వ్యక్తులలో హీరో నవదీప్ తనకు డ్రగ్స్ వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేదు అంటూ గట్టిగా వాదిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా నవదీప్ ఇప్పుడు హడావిడిగా సమాజం గురించి ప్రకృతి సంపదలు గురించి ఆలోచిస్తూ తన భావాలను సోషల్ మీడియాలో తన ట్విటర్ ద్వారా అందరికీ షేర్ చేస్తూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. తన సహ నటులు అంతా సిట్ విచారణను ఎదుర్కుంటూ ఉంటే నవదీప్ మాత్రం తన ట్విటర్ లో నదులు గురించి ఆలోచించండి అని చెబుతున్నాడు. 

మన జీవితాలు కోసం మన నదులను కాపాడుకుందాం రండి అంటూ పిలుపు ఇవ్వడమే కాకుండా ఒక మంచి ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుని దానికి ఒక టాగ్ లైన్ కూడ క్రియేట్ చేసాడు నవదీప్. అంతేకాదు మనం అసలు అవసరమైన వాటి గురించి కాకుండా అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తున్నాం అంటూ కామెంట్స్ కూడ చేసాడు నవదీప్. 

దీనినిబట్టి చూస్తుంటే జనం డ్రగ్స్ కేసును గురించి కాకుండా నదుల గురించి ప్రకృతి గురించి పర్యావరణ గురించి అందరు ఆలోచించమని నవదీప్ మెసేజ్ లు ఇస్తున్నట్లు ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలు లేక ఖాళీగా ఉన్న నవదీప్ అప్పుడు ఏమి మాట్లాడకుండాఇప్పుడు ఇలా ఒకేసారి నదులు వైపు ఎందుకు యూటర్న్ తీసుకున్నాడో ఎవరికైనా సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: