శేఖర్ కమ్ముల అనగానే ఆహ్లాదకరమైన సినిమాలు గుర్తొస్తాయి. ప్లజెంట్ గా సాగిపోతుంటాయి. చాలాకాలం తర్వాత వచ్చిన ఫిదా కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా తమిళమ్మాయి సాయి పల్లవి నటించిన ఫిదా.. ప్రేక్షకుల ముందుకొచ్చింది.


సాయిపల్లవి అమాయకత్వం, పెంకితనం కలిసి.. ప్రేక్షకులకు పక్కింటమ్మాయి ఫీలింగ్ తెచ్చేశాయి. తెలుగులో సొంతంగానే డబ్బింగ్ తెచ్చుకున్న సాయి పల్లవి ... అన్ని అంశాల్లో ఆకట్టుకుంది. తన సహజ నటనతో మంత్రముగ్ధులను చేసింది. వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ అల్లరికి పడిపోయాడు. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇదొక బెస్ట్ మూవీ అవుతుంది. కెరీర్ టర్న్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..


ఫిదా మూవీపై ఓవరాల్ గా అన్ని ఏరియాల నుంచి అద్భుతమైన టాక్ వస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఫిదాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఏ- సెంటర్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ క్యాష్ చేసుకుంది. బి, సి.. సెంటర్లలో కూడా ప్రేక్షకులు ఫుల్ హ్యాపీ. ఓపెనింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇది రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేస్తుందని అంచనా. అమెరికాలోనే ఒకటిన్నర మిలియన్ డాలర్ల వరకూ వసూలు చేస్తుందని బాక్సాఫీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇవాళే విడుదలైన వైశాఖం కూడా పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: