ఎట్టకేలకు ఎన్నో ఎదురు చూపుల తరువాత వరుణ్ తేజ్ కు ‘ఫిదా’ రూపంలో సక్సెస్స్ వచ్చినా ఆ సక్సస్స్ ను ఎంజాయ్ చేయలేని స్థితిలో ఈ మెగా ప్రిన్స్ ఉన్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం నిన్న విడుదల అయిన ఈ  సినిమాకు వస్తున్న ప్రశంసలు అన్ని హీరోయిన్ సాయి పల్లవి ఎకౌంటు లోకి వెళ్ళిపోవడమే కాకుండా ‘ఫిదా’ సక్సస్స్ లో మార్కులు అన్ని సాయి పల్లవి శేఖర్ కమ్ముల వైపు వెళ్లిపోతు ఉనడటంతో ఈ సినిమా హిట్ అయినా వరుణ్ తేజ్ క్రేజ్ కలిసి వచ్చే అవకాసం లేదు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి.

ఒక సున్నితమైన కథను ఒక అందమైన లవ్ స్టోరీగా మార్చి శేఖర్ కమ్ముల చేసిన ప్రయోగంలో మొట్టమొదటి సారి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవినటన అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ మూవీకి మొదటిరోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా బిసీ సెంటర్ల ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

దీనికితోడు ఈ సినిమాకు ఓవర్సీస్ లో మంచి టాక్ రావడంతో ఈ మూవి దిల్ రాజ్ కు కాసులు కురిపించే మరో సినిమాగా మారడం ఖాయం అని అంటున్నారు. ముఖం మీద మొటిమలు చెదరని చిరునవ్వు పక్కింటి అమ్మాయిలా చూడగానే ఆకట్టుకొనే రూపంతో కనిపిస్తున్న సాయి పల్లవిని చూసి సగటు ప్రేక్షకుడు ‘ఫిదా’ అయిపోతున్నాడు.

ఇప్పటికే టాలీవుడ్ లో చాల అవకాశాలు వచ్చినా ఒప్పుకోకుండా మంచి పాత్ర కోసం ఎదురు చూసిన సాయి పల్లవికి భానుమతి పాత్ర బాగా కలిసి రావడమే కాకుండా ఒకే ఒక పాత్రతో స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఇప్పటి వరకు టాలీవుడ్ ను ఏలుతున్న రకుల్ ప్రీత్ లావణ్యా త్రిపాఠి రీసెంట్ గా క్రేజ్ లోకి వచ్చిన పూజ హెగ్డే లకు సాయి పల్లవి షాక్ ఇవ్వడమే కాకుండా ఈమె వల్ల వారి స్థానాలకు గట్టి పోటీ ఏర్పడే అవకాసం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: