మెగా బ్రదర్ నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా ఫిదా. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యి మొదటి షో నుండే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సాయి పల్లవి నటనకు అందరు ముగ్ధులయ్యారంటే నమ్మాలి. సినిమా సక్సెస్ తో వరుణ్ తేజ్ ఫుల్ ఖుషిగా ఉన్నా మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు.


అదేంటి వరుణ్ తేజ్ కు రాక రాక హిట్ వస్తే వారెందరు అన్ హ్యాపీ అంటే.. దీనికి కారణం డైరక్టర్ శేఖర్ కమ్ముల అని అంటున్నారు. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో హిట్ అందుకున్న ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్.. ఈ మూడు సినిమాల్లో హీరోలు రాజా, సుమంత్, వరుణ్ సందేశ్.. ఈ ముగ్గురిలో ఎవరు ఇప్పుడు మంచి పొజిషన్ లో లేరు.


రాజా ఏకంగా సినిమాలకే గుడ్ బై చెప్పేయగా.. వరుణ్ సందేశ్ ఏదో అలా చేస్తున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుమంత్ కూడా కెరియర్ లో నానా కష్టాలు పడుతున్నాడు. ఇక వరుణ్ తేజ్ కూడా వీరి సరసన చేరిపోతాడేమో అని దిగులు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. సెంటిమెంటల్ గా ఇది వర్క్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనే ఆందోళనలో ఉన్నారు.


ఈ విషయాలన్ని ఏం పట్టించుకోకుండా వరుణ్ తేజ్ మాత్రం హిట్ కిక్ ఎంజాయ్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో కెరియర్ లో మొదటి హిట్ అందుకున్న వరుణ్ అన్ని చోట్ల కాసుల వర్షం కురిపిస్తున్నాడని తెలుస్తుంది. సినిమా ఫుల్ రన్ లో 20 నుండి 30 కోట్ల దాకా వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: