డ్రగ్స్ కేసు విషయంలో టాలీవుడ్ టాప్ హీరో రవితేజ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో సిట్ అధికారులకు చిక్కిన జీషన్ అలీ అలియాస్ జాక్ బయట పెట్టిన విషయాలు టాలీవుడ్ సినిమా రంగాన్ని మరింత కుదిపేస్తున్నాయి. 

నిన్న సాయంత్రం అనేక టివి ఛానల్స్ లో దీనికి సంబంధించిన కథనాలు ప్రసారం అయ్యాయి. జాక్ చెపుతున్న విషయాల ప్రకారం మరికొందరి టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. రవితేజకు సంబంధించిన విషయాలను జీషన్ అలీ బయటపెట్టినట్లు తెలుస్తోంది. 

అదే సమయయలో రవితేజ, నవదీప్‌కు జీషన్‌ డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు సిట్‌ వద్ద ఆధారాలు ఉన్నట్లు ఆ ఛానల్ కథనాలు ప్రసారం చేసింది. జీషన్ అలీ దక్షిణాఫ్రికా నుంచి డ్రగ్స్ తెచ్చి రవితేజకు అందించేవాడని, రవితేజ వాటిని సరఫరా చేసేవాడని ఆ ఛానల్ ఆసక్తికర కథనం. జీషన్ అలీ ఈవెంట్ మేనేజర్‌గాఅనేక ఫంక్షన్స్ కు వ్యవహరిస్తూ వస్తున్నాడు అని టాక్. 

డ్రగ్స్ వ్యవహారంలో కెల్విన్ తర్వాత జీషన్ అలీదే కీలక పాత్ర అని ఈ వార్త కథనం వల్ల తెలుస్తోంది. అంతేకాదు జాక్ వస్తే క్రాక్ వచ్చినట్లేనని పబ్‌ లో జోక్ చేసేవారని అనే ప్రచారం కూడ ఉందని  అంటున్నారు. ఇతడు సరఫరా చేసే మత్తు పదార్ధానికి టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులలో మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది చాలదు అన్నట్లుగా జాక్‌కు ఓ ప్రముఖ సంగీత దర్శకుడితో సంబంధాలున్నాయని ఆ ఛానల్ కథనం. జాక్ విచారణలో బుల్లి తెర నటీనటుల పేర్లు కూడా వెల్లడి కావచ్చునని అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రవితేజను సిట్ అధికారులు ఈ నెల 25వ తేదీన విచారించనున్న నేపధ్యంలో రవితేజ విచారణ కూడ ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకంగా మారింది. ఏమైనా ఈ డ్రగ్స్ వ్యవహారం మరింత ఝటిలం అవుతున్న నేపధ్యంలో టాలీవుడ్ షేక్ అవుతోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: