సూపర్ స్టార్ మహేష్ దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కోసం ఎన్నాళ్ల నుండో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలైతే ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో చేయాల్సి ఉంది కాని కుదరలేదు. బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడు అన్న దాని మీద ఓ క్లారిటీ రాలేదు. కాని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ చూస్తుంటే రాజమౌళి తర్వాత సినిమా మహేష్ తోనే అని అంటున్నారు.


ప్రస్తుతం మహేష్ మురుగదాస్ తో స్పైడర్ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాకముందే కొరటాల శివతో భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. అది కూడా ముగింపు దశకు వచ్చాక 2018 మొదట్లోనే వంశీ పైడిపల్లితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు మహేష్. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయినట్టు టాక్. ఇక ఈ సినిమాల తర్వాత మహేష్ కచ్చితంగా రాజమౌళితోనే చేస్తాడని అంటున్నారు.


మహేష్ రాజమౌళి సినిమా కోసం కె.ఎల్ నారాయణ ఇప్పటికే ఇరువురికి అడ్వాన్సులు ఇచ్చి కూర్చుకున్నాడు. ఎన్నాళ్ల నుండో ఈ కాంబో మూవీ వస్తుందని అనుకున్నారు కాని సెట్ అవ్వలేదు. చూస్తుంటే ఈసారి మాత్రం రాజమౌళి మహేష్ తో సినిమా కచ్చితంగా ఫిక్స్ చేసే అవకాశాలున్నాయట. బాహుబలి తర్వాత ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తా అని చెబుతున్న రాజమౌళి మహేష్ తోనే ఆ సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయట.


స్పైడర్, భరత్ అను నేను పూర్తి చేసి వంశీ సినిమా పూర్తి అయ్యే సరికి ఈ విషయం పై ఓ క్లారిటీ రానుంది. ఇప్పటిదాకా ఎన్.టి.ఆర్, ప్రభాస్, రాం చరణ్, రవితేజ లాంటి స్టార్స్ తో తీసిన జక్కన్న మహేష్ తో ఎలాంటి సినిమా తీస్తాడో అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: