వివాదాస్పద ఫేస్ బుక్ పోస్ట్ తో ఇంటర్నెట్ లో హల్చల్ చేసిన రామ్ గోపాల్ వర్మ. డ్రగ్స్ కేసు గురించీ సిట్ గురించీ కాస్త తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. స్కూల్ పిల్లలని సైతం డ్రగ్స్ కేసులో ఇన్నేసి గంటలు విచారణ చేస్తారా అంటూ వివాదానికి తెర లేపారు రామ్ గోపాల్ వర్మ. సిట్ అధికారి అకున్ సబర్వాల్ ని మీడియా అనవసరంగా హీరోని చేస్తోంది అని అభిప్రాయ పడిన రామ్ గోపాల్ వర్మ ఆయనతో బాహుబలి 3 తీస్తే బాగుంటుంది అన్నారు.


ఆయన వ్యాఖ్యల మీద ఒక న్యూస్ ఛానల్ లో లైవ్ వచ్చిన రామూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. బాహుబలి 3 లాంటి కామెంట్ లు చేసిన వర్మ తన ఉద్దేశ్యం ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేసారు.


అకున్ సబర్వాల్ కనీసం ఒక స్పోక్ పర్సన్ ని పెట్టుకుని అయినా అసలు జరుగుతోంది ఏంటి అనేది సిట్ తరఫున చెప్పాలి అనీ లేదంటే చాలా ఫామిలీ లు, పెద్ద పెద్ద సెలబ్రిటీ ల ఫేం లు దెబ్బ తింటున్నాయి అనేది వర్మ చేసిన వ్యాఖ్య. బాహుబ‌లి-3 సినిమాను రాజ‌మౌళి తీస్తాడేమో అని తాను అన్నాన‌ని, ఈ ప్ర‌శ్న‌ను రాజ‌మౌళినే అడ‌గాల‌ని వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: