హాట్ యాంకర్ గా ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న అనసూయకు సినిమాలలో మంచి అవకాశాలే దక్కుతున్నాయి. సినిమాల్లో బిజీగా గడిపేయాలని అనుకుంటున్న అనసూయకు ఆమె కోరికకు తగ్గట్టుగానే భారీ సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆమె రేంజ్ స్టార్ హీరోలు వెయిట్ చేసేంత స్థాయికి ఎదిగిపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

తెలుస్తున్న సమాచారం మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందుతున్న ‘రంగస్థలం’ సినిమాలో అనసూయకు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ పెండింగ్ లో ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆమెది చాల కీలకపాత్ర అని తెలుస్తోంది. దీనితో ఆమె డేట్స్ కోసం సుకుమార్ వెయిట్ చేస్తున్నాడని టాక్.

అయితే అనసూయ అనేక ఛానల్స్ కు సంబంధించిన షోలతో బిజీగా ఉన్న నేపధ్యంలో అనసూయ కారణంగా రంగ స్థలంలో చరణ్ అనసూయల మధ్య చిత్రీకరించవలసిన సీన్స్ షూటింగ్ వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం సుకుమార్ కే కాకుండా చరణ్ కు కూడ అసహనాన్ని కలిగిస్తున్నట్లు ఫిలింనగర్ గాసిప్.

ఒకవైపు సమంత పెళ్ళి తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో ఈ సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఈ షూటింగ్ షెడ్యూల్స్ కు అనసూయ కారణంగా బ్రేక్ పడటం చరణ్ కు ఏమాత్రం రుచించడం లేదు అని అంటున్నారు. దీనికితోడు అనసూయ మంచు విష్ణు మోహన్ బాబులు కలిసి నటిస్తున్న ఒక సినిమాలో మరో కీలక పాత్రకు ఎంపిక అయిన నేపధ్యంలో ఇంత బిజీ మధ్య అనసూయ చరణ్ ‘రంగస్థలం’ కు డేట్స్ ఇవ్వడం కొంత వరకు సమస్యగా  మారింది అనుకోవాలి.

ఇప్పటి వరకు అనసూయ టాప్ హీరోలలో ఒక్క నాగార్జునతో మాత్రమే కలిసి నటించడం జరిగింది. అయితే ఈమె తన కెరియర్ లో మొట్టమొదటిసారిగా టాప్ యంగ్ హీరోలలో మొదటి వరసలో ఉన్న చరణ్ తో ‘రంగ స్థలం’ లో నటిస్తూ ఉండటం ఆమె క్రేజ్ ను సూచిస్తోంది. ఏమైనా ఒక టాప్ యంగ్ హీరోను అనసూయ వెయిట్ చేయించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: