ఇప్పటికే డ్రగ్స్ కేసు వ్యవహారంలో విచారణ ఎదుర్కుంటూ రకరకాల సమస్యల మధ్య సతమతమవుతున్న రవితేజాకు నాగార్జున నుండి ఒక ఊహించని సమస్య ఎదురు కావడంతో మాస్ మహారాజాకు మరింత అయోమయం ఏర్పడింది అన్న వార్తలు వస్తున్నాయి. నాగార్జున లేటెస్ట్ మూవీ ‘రాజు గారి గది-2’ ఈ పాటికే విడుదల కావాల్సింది. 

ఈసినిమాను పక్కా ప్లానింగ్‌ తో దర్శకుడు ఓంకార్ పూర్తి చేసినా నాగార్జున ఈసినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన నేపధ్యంలో ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదు. అయితే ఈ పనులన్నీ ముగించుకుని ఈసినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. 

అయితే ఇప్పుడు ఆ డేట్ ను నాగార్జున తన కొడుకు నాగచైతన్య సినిమా కోసం త్యాగం చేసాడు. ఆతరువాత వచ్చే దసరా సీజన్లో ‘జై లవ కుశ’  ‘స్పైడర్’ ‘పైసా వసూల్’ లాంటి భారీ సినిమాలు వస్తున్న నేపధ్యంలో నాగార్జున ఎటువంటి పోటీ లేకుండా తన రాజుగారి గది 2’ ను అక్టోబరు 12న కాని లేదంటే అక్టోబర్ 19న కాని దీపావళిని టార్గెట్ చేస్తూ విడుదల చేయాలని ఫిక్స్ అయినట్లు టాక్.

అయితే ఇప్పటికే అక్టోబరు 12న రవితేజా నటిస్తున్న రవితేజ సినిమా ‘రాజా ది గ్రేట్’ విడుదలకు డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పుడు రవితేజా నాగార్జునను లెక్క చేయకుండా అదే డేట్ కు వస్తాడా లేదంటే మరో డేట్ ను వెతుక్కుంటూ నవంబర్ కు వెళ్ళి పోతాడా అన్న చర్చలు జరుగుతున్నాయి. 

ప్రస్తుతం రవితేజాకు క్రేజ్ అంతంతమాత్రమే అయిన నేపధ్యంలో ఎటువంటి పండుగ సీజన్ లేకుండా కేవలం సాధారణ రోజులలో అతడి సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు జంకుతున్నట్లు టాక్.  ఏమైనా రవితేజాకు అన్ని సమస్యలు ఒకేసారి ముసురుకున్నాయి అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: