రాబోతున్న దసరా రేస్ రిజల్ట్ రాకుండానే జూనియర్ ‘జై లవ కుశ’ మహేష్ ‘స్పైడర్’ పై అన్ని విధాలా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి దక్షిణ భారత సినిమా రంగంలో టాప్ డైరెక్టర్ గా పేరు గాంచిన మురగదాస్ ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్తున్న సినిమా కాబట్టి ‘స్పైడర్’ కు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతుందని ఈ సినిమా నిర్మాతలు ఆశించారు అని టాక్.

అయితే వీరి అంచనాలకు భిన్నంగా ‘స్పైడర్’ కంటే ఈ దసరా రేసుకు రాబోతున్న ‘జై లవ కుశ’ కు ఊహించన స్థాయికన్నా ఎక్కువ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని టాలీవుడ్ బిజినెస్ వర్గాలు అంటున్నాయి. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ‘స్పైడర్’ కు కనీసం 150 కోట్ల బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది అని ఆశించారు. 

కానీ బిజినెస్ ఆ రేంజ్ లో ‘స్పైడర్’ కు జరగడం లేదు అని టాక్. దీనికి కారణం ‘స్పైడర్ టీజర్ కన్నా ‘జై లవ కుశ’ టీజర్ కు స్పందన విపరీతంగా రావడమే కాకుండా మాస్ ప్రేక్షకులకు ‘స్పైడర్’ కన్నా ‘జై లవ కుశ’ బాగా కనెక్ట్ అవుతుందని బయ్యర్లు భావిస్తున్నట్లు టాక్. దీనికితోడు ‘స్పైడర్’ కు సంబంధించిన రెండవ టీజర్ విడుదల చేయడంలో జరుగుతున్న ఆలస్యం కూడ ‘స్పైడర్’ బిజినెస్ పై నెగిటివ్ ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.

దీనికితోడు జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ తరువాత ‘జై లవ కుశ’ విడుదల అవుతూ ఉంటే ‘బ్రహ్మోత్సవం’ ఫెయిల్యూర్ తరువాత ‘స్పైడర్’ విడుదల అవుతున్న నేపధ్యంలో ‘స్పైడర్’ కు నెగిటివ్ సెంటిమెంట్లు కూడ వెంటాడుతున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా సంక్రాంతికి మించిన స్థాయిలో కేవలం దసరా పండుగను నమ్ముకుని జూనియర్ మహేష్ బాలకృష్ణల సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్న నేపధ్యం కూడ ‘స్పైడర్’ కు శాపంగా మారింది అని అంటున్నారు. ఏమైనా ‘స్పైడర్’ విజయవంతం కాకపోతే ఇమేజ్ పరంగా మహేష్ జూనియర్ కన్నా బాగా వెనకపడే ఆస్కారం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు..     


మరింత సమాచారం తెలుసుకోండి: